అమితాబ్ బంగ్లా ఇక కంటెయిన్మెంట్ జోన్ కాదు !

| Edited By: Pardhasaradhi Peri

Jul 26, 2020 | 6:11 PM

ముంబైలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా' గత 14 రోజులుగా కంటెయిన్మెంట్ జోన్ గా ఉంది. అయితే ఇందుకు సంబంధించిన బోర్డును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదివారం..

అమితాబ్ బంగ్లా ఇక కంటెయిన్మెంట్ జోన్ కాదు !
Follow us on

ముంబైలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ గత 14 రోజులుగా కంటెయిన్మెంట్ జోన్ గా ఉంది. అయితే ఇందుకు సంబంధించిన బోర్డును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదివారం తొలగించారు. బిగ్ బీకి చెందిన నాలుగు భవనాలు..ప్రతీక్ష, జనక్, వత్స, జల్సాలను ఈ నెల 12 న కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించి వాటికి సీలు వేశారు. దీన్ని తొలగించినట్టు వారు తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ సోకినట్టు అమితాబ్ ఈ నెల 11 న ప్రకటించారు. ఆయనతో బాటు ఆయన కుమారుడు, సినీ నటుడు అభిషేక్ బచ్చన్, కోడలు, నటి ఐశ్వర్యా రాయ్,, మనుమరాలు ఆరాధ్య కూడా కోవిడ్-19 కి గురైన సంగతి విదితమే.. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. తమ ఆరోగ్య పరిస్థితి గురించి అమితాబ్, అభిషేక్ బచ్చన్ ఎప్పటికప్పుడు తమ అభిమానులకు ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు.