Congress on Vaccination: ప్రజలకు 100 కోట్లరూపాయలతో  టీకాలు వేయిస్తాం..బీజేపీ ప్రభుత్వానికి కర్నాటక కాంగ్రెస్ లేఖ!

Congress on Vaccination: కోవిడ్ -19 వ్యాక్సిన్లను తయారీదారుల నుంచి నేరుగా సేకరించి వాటిని రాష్ట్ర ప్రజలకు అందించడానికి కర్ణాటక కాంగ్రెస్ 100 కోట్ల రూపాయల ప్రణాళికను సిద్ధం చేసింది.

Congress on Vaccination: ప్రజలకు 100 కోట్లరూపాయలతో  టీకాలు వేయిస్తాం..బీజేపీ ప్రభుత్వానికి కర్నాటక కాంగ్రెస్ లేఖ!
Congress On Vaccination

Updated on: May 15, 2021 | 7:13 PM

Congress on Vaccination: కోవిడ్ -19 వ్యాక్సిన్లను తయారీదారుల నుంచి నేరుగా సేకరించి వాటిని రాష్ట్ర ప్రజలకు అందించడానికి కర్ణాటక కాంగ్రెస్ 100 కోట్ల రూపాయల ప్రణాళికను సిద్ధం చేసిందని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు డికె శివకుమార్ తెలిపారు. మే 14 న కర్ణాటక ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత వలన 18-44 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం నిలిపివేసింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక యూనిట్ అధ్యక్షుడు శివకుమార్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమక్షంలో ఈ ప్రకటన చేశారు. “మోడీ, యడ్యూరప్ప ప్రభుత్వాలు సామూహికంగా టీకాలు వేయడంలో విఫలమైనందున, మేము ప్రజలకు వ్యాక్సిన్ అందచేయాలని అనుకుంటున్నాము. అందుకోసం మాకు రెండు చిన్న అనుమతులు అవసరం, ఒకటి కేంద్ర ప్రభుత్వం నుండి మరొకటి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుండి” అని డికె శివకుమార్ అన్నారు. “భారతీయ జనతా పార్టీకి నా విజ్ఞప్తి ఏమిటంటే, వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలు అడ్డు రాకూడదు. అలాగే, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో, కాంగ్రెస్ నేరుగా వ్యాక్సిన్లను సేకరించడానికి, నిర్వహించడానికి అనుమతించండి.” అంటూ శివకుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ -19 వ్యాక్సిన్ల మోతాదులను కేంద్రం యొక్క “సరళీకృత వ్యాక్సిన్ ధర” విధానం ప్రకారం సేకరించవచ్చు. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ మోతాదులలో సగం కేంద్రానికి కేటాయించగా, మిగిలిన 25 శాతం చొప్పున రాష్ట్రాలు అలాగే ప్రైవేట్ ఆసుపత్రులను సేకరించాలని ఆయన కోరారు. టీకా తయారీదారులైన పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ నుంచి నేరుగా వ్యాక్సిన్ లు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. టీకా డ్రైవ్‌ను కిక్‌స్టార్ట్ చేయడానికి కాంగ్రెస్‌కు 100 కోట్ల రూపాయల ప్రణాళిక ఉందని డికె శివకుమార్ అన్నారు. ఇందులో రూ .10 కోట్లు మాత్రమే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నిధి నుండి చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుండి మరో 90 కోట్లు రావచ్చు. మోడీ, యడ్యూ  ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ చేయడంలో విఫలమైనందున టీకాలను నేరుగా పారదర్శకంగా సేకరించడానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులను ఉపయోగించడానికి అనుమతించమని యడ్యూరప్ప ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు శివకుమార్ చెప్పారు.

ఈ ప్రణాళిక కోసం ఎమ్మెల్యేలకు కేటాయించిన గ్రాంట్ల నుంచి రూ .100 కోట్లు విడుదల చేయాలని కోరుతూ సిద్దరామయ్య శనివారం కర్ణాటక సిఎం బిఎస్ యెడియరప్పకు లేఖ రాశారు.

గ్లోబల్ టెండర్ కోసం రూ .840 కోట్లు ఆమోదించబడ్డాయి: కర్ణాటక కోవిడ్ టాస్క్ ఫోర్స్
ఇదిలా ఉండగా, గ్లోబల్ టెండర్ల ద్వారా 2 కోట్ల వ్యాక్సిన్ల సేకరణకు రూ .840 కోట్లు ఆమోదించినట్లు కర్ణాటక ప్రభుత్వ కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ శనివారం తెలిపింది. 50 లక్షల మోతాదుల చొప్పున నాలుగు బ్యాచ్‌లలో టెండర్లు వేస్తారు.
వీధి విక్రేతలు, బ్యాంక్ ఉద్యోగులు, డెలివరీ ఏజెంట్లు మరియు ఇంటర్నెట్ సర్వీస్ ఏజెంట్లను ప్రాధాన్యతపై టీకాలు వేయనున్నట్లు రాష్ట్ర కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్ తెలిపింది.

Also Read: COVID VACCINATION: వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు తొలగిన అడ్డంకి.. శభాష్ దోవల్ జీ..!

Breathing exercise: కరోనాతో వచ్చే శ్వాసలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి శ్వాస వ్యాయామాలు చేయండి..ఈవిధంగా..

 

Loading...
Unable to load recommendations.
Follow Us