National Herald Case: రాజులా వ్యవహరిస్తున్నారు.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన రాహుల్..

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ(ED) మంగళవారం రెండోసారి విచారిస్తోంది. సోనియా గాంధీని ప్రశ్నించడంపై కాంగ్రెస్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్..

National Herald Case: రాజులా వ్యవహరిస్తున్నారు.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన రాహుల్..
Rahul Gandhi

Updated on: Jul 26, 2022 | 3:36 PM

మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ(ED) మంగళవారం రెండోసారి విచారిస్తోంది. సోనియా గాంధీని ప్రశ్నించడంపై కాంగ్రెస్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సహా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అయితే.. ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలతో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అతన్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని కింగ్స్‌వే క్యాంప్‌కు తరలించారు. నిజానికి రాహుల్ గాంధీ రాష్ట్రపతిని కలవాలని, మెమోరాండం ఇవ్వాలని అనుకున్నారు. కానీ విజయ్ చౌక్ దాటి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో రాహుల్ విజయ్ చౌక్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, పార్టీ పెద్ద నాయకులు పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ కాంగ్రెస్ ఎంపీలు విజయ్ చౌక్‌కు చేరుకున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అనేక ఇతర సమస్యలపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీస్ రాజ్యం నడుస్తోందని.. ప్రధాని మోదీ రాజులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు లోపల చర్చకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు.

ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే ఈ ఆరోపణలు

పోలీసుల అనుమతితోనే తాము నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్‌ నేత, ఎల్‌ఓపీ మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ఇదంతా ప్రతిపక్షాలను తొక్కేసేందుకే  ప్రధాని మోదీ, అమిత్ షాల కుట్ర ఇదని విమర్శించారు. మేము భయపడం, మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us