CM Kcr: తెలంగాణ మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్తత.. ఐసియులో చికిత్స.. పరామర్శించిన సీఎం కేసీఆర్..

CM Kcr: తమిళనాడు పర్యటనలో మూడు రోజుల నుంచి సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు కూడా కేసీఆర్ పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న..

CM Kcr: తెలంగాణ మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్తత.. ఐసియులో చికిత్స.. పరామర్శించిన సీఎం కేసీఆర్..
Cm Kcr Narasimhan

Updated on: Dec 15, 2021 | 12:46 PM

CM Kcr: తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు కూడా కేసీఆర్ పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ విషయం కేసీఆర్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కావేరి ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్న నరసింహన్ ను ,ఆయన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ పరామర్శించినట్లు తెలుస్తోంది.  ఐసియులో నరసింహన్‌కు చికిత్సనందిస్తున్నందున వైద్యులు సీఎం కేసీఆర్ ను దూరం నుంచి చూడడనికి మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ దూరం నుంచే ఆయన్ని చూసి నరసింహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బుధవారం సీఎం కేసీఆర్ .. ఎమ్‌ఎన్‌ఎమ్‌ అధ్యక్షడు, సినీ నటుడు కమలహాసన్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయని సీఎంవో వర్గాలు తెలిపాయి.  సాయంత్రం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్  కు యాదాద్రి గుడికి రమ్మనమని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

 

 

Also Read:  ఆస్ట్రేలియా ప్రధానికి కరోనా పాజిటివ్.. దక్షిణ కొరియా అధ్యక్షుడి సహా 1000 మందిలో ఆందోళన

Loading...
Unable to load recommendations.
Follow Us