AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!

కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలలో భాగంగా జనాభా లెక్కలతో పాటు కుల గణనను నిర్వహించాలని నిర్ణయించారు. సర్వేలకు బదులుగా పారదర్శకమైన విధానం ద్వారా కుల గణనను చేపట్టనున్నారు. అలాగే, సిల్చార్-షిల్లాంగ్ కారిడార్ నిర్మాణం, చెరుకు కనీస మద్దతు ధర పెంపు, అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర క్యాబినేట్‌ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కులగణన!
Pm Modi
SN Pasha
|

Updated on: Apr 30, 2025 | 4:29 PM

Share

ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టనున్నట్లు వెల్లడించింది. సర్వేలకు బదులుగా పారదర్శకంగా కులగణన చేపట్టి, జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటే సిల్చార్‌-షిల్లాంగ్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం, 166.8కి.మీ మేర రూ.22,864 కోట్లతో కారిడార్ నిర్మాణం, చెరుకు పంటకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం, క్వింటాకు రూ.355 ఎఫ్‌ఆర్‌పీ పెంపు, అసోం-మేఘాలయ మధ్య కొత్త హైవే నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి