గోవాలో జరిగిన ఐరన్మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్ను పూర్తి చేసిన తొలి పార్లమెంటేరియన్గా బీజేపీ నేత, బెంగళూరు సౌత్కు చెందిన లోక్సభ ఎంపీ తేజస్వి సూర్య ఆదివారం నిలిచారు. ఈ ఈవెంట్లో 1.9 కిమీ ఈత, 90 కిమీ సైక్లింగ్, 21.1 కిమీ పరుగులో ఆయన పాల్గొన్నారు. ఈ ఘనత సాధించడానికి తనకు నాలుగు నెలలు శ్రమించినట్లు ఎంపీ తెలిపారు.
తన ఫీట్ భారతీయ యువకులను ఫిట్నెస్ లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నానట్లు ఆయన ట్విట్ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా ప్రశంసించాడు. “ఫిట్నెస్-సంబంధిత కార్యకలాపాలను కొనసాగించడానికి ఇది చాలా మంది యువకులకు స్ఫూర్తినిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.” అని ఆయన తేజస్వి సూర్య ప్రశంసిస్తూ ట్విట్ చేశాడు.
Commendable feat!
I am sure this will inspire many more youngsters to pursue fitness related activities. https://t.co/zDTC0RtHL7
— Narendra Modi (@narendramodi) October 27, 2024
2022 రిలే ఈవెంట్లో, సూర్య 90 కిమీ సైక్లింగ్ సెగ్మెంట్ను పూర్తి చేశాడు. ఇది ఐరన్మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. అతను మొత్తం ఈవెంట్ను 8 గంటల 27 నిమిషాల 32 సెకన్లలో పూర్తి చేశాడు. ఐరన్మ్యాన్ 70.3 గోవాలో పురుషుల టైటిల్ను ఇండియన్ ఆర్మీకి చెందిన బిశ్వర్జిత్ సాయిఖోమ్ 4 గంటల, 32 నిమిషాల 4 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంతో రేసును పూర్తి చేశాడు. మహిళల విభాగంలో ఈజిప్ట్ క్రీడాకారిణి యాస్మిన్ హలావా 5 గంటల 22 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది.