బీహార్ ఎన్నికలు, 9 మంది రెబెల్ బీజేపీ నేతల బహిష్కరణ

| Edited By: Balu

Oct 13, 2020 | 11:47 AM

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగనున్న 9 మంది బీజేపీ నేతలను పార్టీ ఆరేళ్ళ పాటు బహిష్కరించింది. వీరి నిర్ణయం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిపై

బీహార్ ఎన్నికలు, 9 మంది రెబెల్ బీజేపీ నేతల బహిష్కరణ
Follow us on

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగనున్న 9 మంది బీజేపీ నేతలను పార్టీ ఆరేళ్ళ పాటు బహిష్కరించింది. వీరి నిర్ణయం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిపై కఠిన చర్య తీసుకున్నామని కమలనాథులు తెలిపారు. ఈ తొమ్మిది మందీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్లను ఆశించినప్పటికీ వారికి నాయకత్వం టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ తొమ్మిది మందీ బీజేపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు.