Sadhvi Pragya: ‘గోమూత్రం తాగండి, క‌రోనా మిమ్మ‌ల్ని ఏం చేయ‌లేదు’.. సాధ్వీ ప్రగ్యా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా నుండి చేసిన వింత ప్రకటన ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆవు మూత్రం తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్....

Sadhvi Pragya: గోమూత్రం తాగండి, క‌రోనా మిమ్మ‌ల్ని ఏం చేయ‌లేదు.. సాధ్వీ ప్రగ్యా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Sadhvi Pragya

Updated on: May 17, 2021 | 3:59 PM

భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా నుండి చేసిన వింత ప్రకటన ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆవు మూత్రం తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తొలగిపోతుందని ఆమె చెప్పారు. “నేను క్రమం తప్పకుండా ఆవు మూత్రాన్ని తీసుకుంటాను. కాబట్టి నేను ఎటువంటి మెడిసిన్ తీసుకోవలసిన అవసరం లేదు. కరోనా కూడా న‌న్ను ఏం చేయలేదు” అని సాధ్వీ ప్రగ్యా తెలిపారు. ప్రతి ఒక్కరూ గోమూత్రం సేవించాల‌ని ఆమె స‌ల‌హా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఆదివారం భోపాల్‌లోని బైరాగర్ లో జ‌రిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఇదే క్ర‌మంలో దేశి ఆవును అందరూ పెంచుకోవాలని సాధ్వీ ప్రగ్యా సూచించారు. ఆమె లోక్‌సభ నియోజకవర్గంలో కోటి మొక్కలను పెంచే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టారు. ప్రతి వ్యక్తి పీపాల్, మర్రి, తులసి మొక్కలను నాటితే అదనపు ఆక్సిజన్ అవసరం లేదని సాధ్వీ అన్నారు.

ఆవు మూత్రం తీవ్రమైన వ్యాధిని నయం చేస్తుందని సాధ్వీ చెప్పడం ఇదే మొదటిసారి కాదు. తనకు సోకిన‌ క్యాన్సర్‌ను నయం చేయడానికి ఆవు మూత్రం, పంచ్యాగవి సహాయపడ్డాయని 2019 ఏప్రిల్‌లో సాధ్వీ పేర్కొన్నారు.

Also Read: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి ‘బ్లాక్ ఫంగస్’..

డిజిట‌ల్ లో మోత మోగిస్తున్న ‘రాధే’.. స‌ల్లూ భాయ్ స్ట్రాటజీ అదుర్స్.. సర్వ‌ర్స్ డౌన్

Loading...
Unable to load recommendations.
Follow Us