AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: భారత్‌ – పాక్‌ యుద్ధం జరిగితే.. ఒక దేశం నాశనం..! ఆ దేశం ఏదో బాబా వంగా అప్పుడే చెప్పారా?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బాబా వంగా 2025 గురించి చేసిన అంచనాలు ప్రస్తుత పరిస్థితితో జోడిస్తున్నారు. కానీ, ఆమె ప్రవచనాలలో భారత్-పాకిస్తాన్ యుద్ధం లేదా పాకిస్తాన్ నాశనం గురించి ప్రత్యక్షంగా ప్రస్తావన లేదు.

Baba Vanga: భారత్‌ - పాక్‌ యుద్ధం జరిగితే.. ఒక దేశం నాశనం..! ఆ దేశం ఏదో బాబా వంగా అప్పుడే చెప్పారా?
Baba Vanga Prediction On In
SN Pasha
|

Updated on: May 02, 2025 | 11:02 AM

Share

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాక్‌ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవలె భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత సైనిక అధికారులతో సమావేశం నిర్వహించి, ఉగ్రవాదులను అంతం చేయడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మోదీ ప్రకటనతో పాకిస్తాన్‌లో ఆందోళనలు పెరిగాయి. ఏ సమయంలో భారత్‌ దాడి చేస్తుందో అని పాక్‌ బిక్కు బిక్కు మంటూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక వేళ నిజంగానే భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం వస్తే.. ఏ దేశం గెలుస్తుంది, ఏ దేశం నాశనం అవుతుందనే విషయాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వంగా అంచనా వేశారు.

ఆమె బతికి ఉన్న సమయంలో చెప్పిన అనేక విషయాలు కాలక్రమంలో నిజం అవుతూ వచ్చాయి. 2025లో ఆమె చెప్పిన భూకంపాలు కూడా సంభవించాయి. దీంతో.. యుద్ధాల గురించి ఆమె చెప్పింది జరిగితీరుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు. 12 సంవత్సరాల వయసులో కంటి చూపు కోల్పోయిన బాబా వంగా 1911లో బల్గేరియాలో జన్మించి 1996లో మరణించారు. అయితే ఆమె అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. బాబా వంగా భారత్‌, పాకిస్తాన్ మధ్య యుద్ధం లేదా పాకిస్తాన్ నాశనం గురించి ప్రత్యేకంగా అంచనా వేయలేదు. కానీ, ఇండియాతో యుద్ధం జరిగితే పాకిస్తాన్ పతనాన్ని ఆమె ముందే చెప్పిందనే విషయం సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతోంది. కానీ, అది బాబా వంగా స్వయంగా చెప్పిందా? కాదా? అనేదానిపై క్లారిటీ లేదు.

2025 గురించి బాబా వంగా అంచనాలు..

ఇండియాతో యుద్ధంలో పాకిస్తాన్ భవితవ్యం గురించి బాబా వంగా చెప్పిన జోస్యం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చాలావరకు ఊహాజనితమైనవి. 2025 కోసం ఆమె చేసిన అంచనాలలో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం లేదా పాకిస్తాన్ విధ్వంసం గురించి ప్రత్యక్ష ప్రస్తావన లేదు. 2025 సంవత్సరానికి బాబా వంగా చేసిన ప్రవచనాలు ఐరోపాలో ఒక పెద్ద సంఘర్షణ, మానవ నాగరికత ముగింపుకు సంభావ్య ప్రారంభాన్ని ప్రస్తావించారు. కానీ ఇండియా, పాకిస్థాన్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను బాబా వంగా అంచనాలతో అనుసంధానిస్తున్నారు. ఆమె దూరదృష్టి ప్రస్తుత పరిస్థితికి వర్తిస్తుందని నమ్ముతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి పెంపు
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్