రామమందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ!

అయోధ్యలోని ప్రముఖ రామ మందిరంలో కానుకల దొంగతనం, ఆర్థిక అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం (జూన్ 29, 2026) న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌లు ఎం.ఎం. సుందరేశ్, శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలిస్తూ, దీనిపై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేసింది. "ప్రస్తుతానికి ఆకాశమేమీ కూలిపోదు... దీనికి ఇంత తొందర ఎందుకు?" అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మౌఖికంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

రామమందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ!
Ayodhya Ram Mandir

Updated on: Jun 29, 2026 | 6:43 PM

అయోధ్యలోని ప్రముఖ రామ మందిరంలో కానుకల దొంగతనం, ఆర్థిక అవకతవకలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం (జూన్ 29, 2026) న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌లు ఎం.ఎం. సుందరేశ్, శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలిస్తూ, దీనిపై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేసింది. “ప్రస్తుతానికి ఆకాశమేమీ కూలిపోదు… దీనికి ఇంత తొందర ఎందుకు?” అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మౌఖికంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవహారాలు, పరిపాలనకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, ఇతర ఆరోపిత చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నేతృత్వంలోని బహుళ-విభాగాల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేత విచారణ జరిపించాలని న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ తమ పిటిషన్‌లో కోరారు. కోట్లాది మంది భక్తులు, దాతల విశ్వాసాన్ని నిలబెట్టడానికి, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన నియంత్రణ, పర్యవేక్షణ, ఆడిట్ యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి, ఆలయ ట్రస్టుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. “శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సంబంధించిన నిధుల దుర్వినియోగం, ఇతర అవకతవకలపై వచ్చిన నివేదికలు నిజమా కాదా అనేది పక్కనబెడితే.. అయోధ్య వైభవ వారసత్వ పునరుద్ధరణ కోసం సుదీర్ఘ పోరాటం చేసిన తరాలలో ఈ వార్తలు తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రామ మందిరానికి సమర్పించిన కానుకల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ ఎస్ఐటీలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. అయితే, ఈ సిట్ ఎటువంటి ఎఫ్ఐఆర్ గానీ, సాధారణ క్రిమినల్ కేసు గానీ నమోదు చేయకుండానే దర్యాప్తు ప్రారంభించిందని పిటిషనర్లు ఆరోపించారు. కేవలం పరిపాలనా అధికారులతో కూడిన దర్యాప్తు కంటే, సంక్లిష్టమైన ఆర్థిక, నేర కేసులను దర్యాప్తు చేసే నైపుణ్యం, వనరులు, సంస్థాగత నిర్మాణం కలిగిన సీబీఐ ద్వారా స్వతంత్ర విచారణ జరిపితేనే ప్రజల్లో ఎక్కువ విశ్వాసం ఉంటుందని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us