అస్సాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని మదర్సాలు, సంస్కృత స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ, ఆర్థిక శాఖ మంత్రి కూడా అయిన హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. మత పరమైన బోధనలు చేసే ఈ విధమైన సంస్థలు ప్రభుత్వానికి ‘గుదిబండలు’గా మారాయని, ప్రభుత్వ నిధులతో వీటిని నిర్వహించచజాలమని ఆయన చెప్పారు. అయితే ప్రైవేటుగా నడిచే ఈ విధమైన సంస్థల విషయంలో తాము చెప్పేదేమీ లేదని ఆయన అన్నారు . మదర్శాలు, సంస్కృత స్కూళ్ల మూసివేత విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి.