సినీఫక్కీలో పట్టపగలే లూటీ..! పోలీసుల్లా నటించి 14 కోట్ల విలువైన బంగారాభరణాలు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా

సినీ ఫక్కీలో ఓ దొంగల ముఠా పట్టపగలే పోలీసుల వేషంలో వచ్చి దర్జాగా బంగారు నగల షాపును దోచుకెళ్లారు. కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చక్కగా మూటగట్టుకుని ఊడాయించారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం (జూన్ 4) మధ్యాహ్నం ఈ షాకింగ్‌ ఘటన చోటు..

సినీఫక్కీలో పట్టపగలే లూటీ..! పోలీసుల్లా నటించి 14 కోట్ల విలువైన బంగారాభరణాలు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా
Maharashtra Jewellery Shop Robbery

Updated on: Jun 05, 2023 | 6:18 PM

కొల్హాపూర్‌: సినీ ఫక్కీలో ఓ దొంగల ముఠా పట్టపగలే పోలీసుల వేషంలో వచ్చి దర్జాగా బంగారు నగల షాపును దోచుకెళ్లారు. కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు చక్కగా మూటగట్టుకుని ఊడాయించారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆదివారం (జూన్ 4) మధ్యాహ్నం ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సాంగ్లీలోని రిలయన్స్‌ జ్యువెల్లరీ నగల దుకాణం వద్దకు దాదాపు 8 మంది దొంగలు రెండు కార్లలో వచ్చారు. అనంతరం పోలీసుల్లా వేషాలు మార్చుకుని ఆదివారం మధ్యాహ్నం 2:30 నుంచి 3:00 గంటల ప్రాంతంలో షాప్‌లోకి ప్రవేశించారు. నిజం పోలీసుల్లా నటిస్తూ తుపాకులతో సిబ్బందిని బెదిరించి బందించారు. ఓ వ్యక్తి ప్రతిఘటించగా అతనిపై కాల్పుల జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల ధాటికి వ్యక్తికి గాయాలయ్యాయని, దుకాణంలోని అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. అనంతరం బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని చెప్పారు.

సమాచారం అందుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, షాప్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించి జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. షాప్‌లో 70 శాతం నగలను మూట కట్టుకెళ్లారు. మొత్తం14 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us