
అహ్మదాబాద్లో ఒక వ్యక్తి ఆడ ఏనుగును పదే పదే కొడుతున్న వీడియో X సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తెగ వైరల్ కావడంతో దీనిపై గుజరాత్ అటవీ శాఖ స్పందించింది. ఆ వ్యక్తి ఏనుగును కొడుతున్న తీరపై విచారణ చేపట్టింది. మావటి ఏనుగును కర్రతో దాదాపు 19 సార్లు కొట్టిన 43 సెకన్ల వీడియో వైరల్ కావడంతో జంతు సంక్షేమ న్యాయవాదులు సహా ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. జంతువును కర్రతో కొడుతూ వేధించడంతో ఆ వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
శుక్రవారం అహ్మదాబాద్లో జరిగిన 148వ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఖాడియాలోని దేశాయ్ ని పోల్ సమీపంలో బాబులాల్ అనే ఒంటరి మగ ఏనుగు బిగ్గరగా డీజే సంగీతం మరియు ఉరుములతో కూడిన శబ్దాలతో ఉలిక్కిపడి పరిగెత్తిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఒరిసాలోని జగన్నాథ్ రథోత్సవంలో ఓ ఏనుగు బిభీత్సం సృష్టించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా జనాన్ని చూసిన ఏనుగు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. దీంతో చాలా మంది గాయపడ్డారు. ఇటీవలి వీడియోలో ఏనుగును కొడుతున్న వ్యక్తి జూన్ 27న జరిగిన రథయాత్ర ఊరేగింపులో ఏనుగులతో పాటు ఉన్నాడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు. జూన్ 27 సాయంత్రం ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ఆడ ఏనుగును కొట్టిన వ్యక్తి మావటి వాడేనని తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ మండిపోతున్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
इतनी क्रूरता, गजराज को बांधकर मारा गया
ये वीडियो अहमदाबाद के जगन्नाथ मंदिर का बताया जा रहा है, रथयात्रा के हाथी पर ऐसी क्रूरता करनेवाले पर कार्रवाई होगी?!
pic.twitter.com/5KQwmpjLAU— Kamit Solanki (@KamitSolanki) June 28, 2025
ఏనుగును వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 ప్రకారం షెడ్యూల్ I ప్రకారం కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. ఈ చట్టం దానికి అత్యున్నత స్థాయి చట్టపరమైన రక్షణను అందిస్తుంది. దానికి ఏదైనా హాని కలిగించడం తీవ్రమైన నేరం, దీనికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, కనీసం రూ.25,000 జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని అటవీ అధికారి తెలిపారు.