Corona Virus: ప్రాణాలతో చెలగాటం….. 5 నిముషాల్లో ఆక్సిజన్ లేక 22 మంది కోవిద్ రోగుల మృతి….

| Edited By: Phani CH

Jun 08, 2021 | 1:29 PM

యూపీలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి యజమాని చేసిన నిర్వాకమిది..మాక్ డ్రిల్ పేరిట 5 నిముషాల్లో 22 మంది కోవిద్ రోగుల ప్రాణాలు తీశాడట..

Corona Virus: ప్రాణాలతో చెలగాటం..... 5 నిముషాల్లో ఆక్సిజన్ లేక 22 మంది కోవిద్ రోగుల మృతి....
22 Patients Dead
Follow us on

యూపీలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి యజమాని చేసిన నిర్వాకమిది..మాక్ డ్రిల్ పేరిట 5 నిముషాల్లో 22 మంది కోవిద్ రోగుల ప్రాణాలు తీశాడట..(అయితే ఇంతమంది మరణించలేదని,,అసలు ఎంతమంది మృతి చెందారో తెలియదని అంటున్నాడు). రోగులకు ఆక్సిజన్ లేకపోతే ఎంతసేపటిలో..ఎంతమంది మరణిస్తారు…ఎందరు బతుకుతారో తెలుసుకునేందుకు ఇతగాడు “భయంకర’ ప్రయోగమే చేశాడు. చికిత్స పొందుతున్న కోవిద్=నాన్-కోవిద్ వార్డుల్లోని రోగులకు 5 నిముషాల పాటు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేశాడు. అసలే ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఇలా ఓ ప్రయోగం చేసి చూద్దామనుకున్నాడట.. మా హాస్పిటల్ లో ఆక్సిజన్ లేదని చెబుతున్నా రోగుల తాలూకు బంధువులు డిశ్చార్జ్ చేయవద్దంటూ ప్రాధేయపడడంతో ఈ ప్రయోగానికి పూనుకొన్నామన్నాడు. ఏప్రిల్ 26 న తాము 5 నిముషాలపాటు ఆక్సిజన్ నిలిపివేయగా 22 మంది రోగుల శరీరాలు నీలి రంగులో మారాయని, శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడ్డారని అరింజయ్ జైన్ అనే ఈ హాస్పిటల్ యజమాని చెప్పాడు. దాంతో ప్రాణవాయువు లేక వీరు మరణించడం ఖాయమని తాము నిర్ధారించుకున్నామన్నాడు.మిగిలిన కొంతమంది రోగుల బంధువులను మీ ఆక్సిజన్ మీరే తెచ్చుకోవాలని సూచించామన్నాడు. ఇతగాడు చెప్పిన మాటల తాలూకు వీడియో ఆ మధ్య రిలీజయింది. ఈ మాక్ డ్రిల్ లో నలుగురు రోగులు ఏప్రిల్ 26న, ముగ్గురు 27 న మృతి చెందారని చెప్పాడు..మరి 22 మంది మరణించినట్టు వార్తలు వచ్చాయనగా ఎంతమంది మృతి చెందిందీ తనకు తెలియదన్నారు.

అయితే ఈ వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించినప్పటికీ.. తన చెప్పినదానిని మరో రకంగా అన్వయించుకున్నారని జైన్ చెప్పాడు. ఈ హాస్పిటల్ లో రోగుల మృతి.. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆగ్రా వైద్య అధికారి ఓ కమిటీని నియమించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Strange Snake fact check: కరీంనగర్‌లో అరుస్తున్న పాము.. వైరల్ వీడియోలో అసలు మలుపు..!

ఓ ఇంజనీర్ లీలలు.. పెళ్లి పేరిట 12 మంది యువతులపై లైంగిక వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే.?