Digvijaya Singh: 2023 కాంగ్రెస్‌‌కు చివరి ఎన్నికలు.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

|

Feb 19, 2022 | 7:49 PM

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Digvijaya Singh: 2023 కాంగ్రెస్‌‌కు చివరి ఎన్నికలు.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
Digvijaya Singh
Follow us on

Digvijaya Singh Sensational Comments: మధ్యప్రదేశ్(Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections 2023) కాంగ్రెస్‌(Congress)కు చివరి ఎన్నికలు అని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. దీని తర్వాత ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వరు. శనివారం రత్లాంలోని స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో జవరా కాంగ్రెస్‌ నేతలతో అనధికారికంగా చర్చించిన సందర్భంగా దిగ్విజయ్‌సింగ్‌ ఈ విషయం చెప్పారు. దిగ్విజయ సింగ్ పార్టీ కార్యకర్తలను జట్టుగా పని చేయమని సలహా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దిగ్విజయ్ సింగ్ రత్లాం బస సమయంలో సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కాంగ్రెస్ వర్గాల నాయకులు జావ్రా నుండి ఆయనను కలవడానికి వచ్చారు. వివిధ వర్గాల నాయకుడు దిగ్విజయ్ సింగ్ విడివిడిగా కలవాలనుకున్నారు. అయితే ఆయన అందరూ కలిసి కలవాలని పిలుపునిచ్చారు. దిగ్విజయ్ సింగ్ జావ్రా ఈ కాంగ్రెస్ నేతలతో చర్చిస్తూ మీరు ఒకరితో ఒకరు రావడానికి సిద్ధంగా లేరు. ఒకరితో ఒకరు మాట్లాడటానికి సిద్ధంగా లేరు. అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయకుంటే 2023 ఎన్నికలే కాంగ్రెస్‌కు చివరి ఎన్నికలు అని గుర్తుంచుకోవాలన్నారు. దీని తర్వాత ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఇవ్వరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో స్థానిక నేతలు ఆయన మాటలతో విస్తుపోయారు. అసలే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పీకలలోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఆయన వ్యాఖ్యలు కృంగదీశాయి.

దిగ్విజయ్ సింగ్ కార్యకర్తలతో జరిగిన ఈ అనధికారిక చర్చను కొందరు మీడియా ప్రతినిధులు రికార్డ్ చేశారు. ఈ విషయం దిగ్విజయ్ సింగ్ దృష్టికి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మొత్తం ఘటన కూడా రికార్డు అయింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలావుంటే, మధ్యప్రదేశ్‌లో 2023 చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 15 సంవత్సరాల విరామం తర్వాత కాంగ్రెస్ తిరిగి మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. అయితే, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడంతో ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 15 నెలలు మాత్రమే కొనసాగింది. మరోసారి ఎంపీలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంది.

Read Also…. 

PK meets Nitish: ప్రశాంత్‌ కిషోర్‌, నితీష్‌ కుమార్‌ రహస్య భేటీ.. సర్‌ప్రైజ్‌ డిన్నర్‌ వెనుక కారణం ఇదేనా!

UP Elections: బుందేల్‌ఖండ్‌పై మూడు పార్టీల కన్ను.. పూర్వ వైభవం కోసం బీఎస్పీ ‘మాయ’జాలం!