Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీతో ఊపిరాడక ఇద్దరు మృతి..

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 4:22 PM

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయానికి భక్తుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగింది. హారతి ఇచ్చే సమయంలో ప్రజలు కాంప్లెక్స్‌కు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు చనిపోయారు.

Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీతో ఊపిరాడక ఇద్దరు మృతి..
Janmashtami Rush
Follow us on

Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆలయంలో అర్థరాత్రి కిక్కిరిసిన భక్తుల రద్దీతో ఊపిరాడక ఇద్దరు మృతిచెందిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఆలయలోంచి బయటకు వచ్చే మార్గంలో ఒక భక్తుడు స్పృహతప్పి పడిపోయాడు. దీని కారణంగా భక్తుల రాకపోకలను పరిమితం చేశారు. వారి రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆవరణలో ఉన్న చాలా మంది ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

‘ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయానికి భక్తుల సంఖ్య ఆకస్మాత్తుగా పెరిగింది. హారతి ఇచ్చే సమయంలో ప్రజలు కాంప్లెక్స్‌కు భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు భక్తులు చనిపోయారు. ఇద్దరిలో ఒకరు మహిళగా చెప్పారు.. మధుర సీనియర్‌ పోలీసు అభిషేక్‌ యాదవ్‌. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్టు వెల్లడించారు. వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించారు.

శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మస్థలంగా పరిగణించబడే మధురను ఒక పవిత్ర ప్రదేశంగా పరిగణిస్తారు.మధుర,బృందావనం వంటి ఆలయాలు అద్భుతంగా అలంకరించబడ్డాయి . వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఇక శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ముంబైలో ప్రజలు ప్రసిద్ధ క్రీడ దహీ హండిలో మునిగితేలుతుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి