
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. భారత మండపం వేదికగా బ్రిక్స్ సమ్మిట్ కొనసాగుతోంది.ఈ సదస్సుకు 11 సభ్య దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. తొలిసెషన్లో రెండు గంటల పాటు చర్చలు జరగనున్నాయి. సా.4 గంటలకు జాయింట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. అయితే పశ్చిమాసియా సంక్షోభంపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.