చెన్నై ‘బస్ డే’ వేడుకల్లో అపశృతి..!
విద్యార్థుల అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా ఉంటుందనే ఆలోచనే వారిని మృత్యు అంచుల వరకు తీసుకెళ్లింది. చెన్నైలోని ‘పశ్చాయప్ప కాలేజీ’ విద్యార్థులు చేసిన ‘బస్ డే’ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సుమారు 30 మంది స్టూడెంట్స్ రన్నింగ్ బస్సు పైకెక్కి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారే బ్రేక్ వేయడంతో కొందరు కిందపడ్డారు. ఈ ఘటన అన్నానగర్ రోడ్లో చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. చైన్నైలో కళాశాల విద్యార్థులు […]
విద్యార్థుల అత్యుత్సాహం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా ఉంటుందనే ఆలోచనే వారిని మృత్యు అంచుల వరకు తీసుకెళ్లింది. చెన్నైలోని ‘పశ్చాయప్ప కాలేజీ’ విద్యార్థులు చేసిన ‘బస్ డే’ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సుమారు 30 మంది స్టూడెంట్స్ రన్నింగ్ బస్సు పైకెక్కి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారే బ్రేక్ వేయడంతో కొందరు కిందపడ్డారు. ఈ ఘటన అన్నానగర్ రోడ్లో చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు.
చైన్నైలో కళాశాల విద్యార్థులు ‘బస్ డే’ పేరుతో వేడుకలు చేస్తారు. కాని గత కొన్ని సంవత్సరాలుగా బస్ డే వేడుకలను తమిళనాడు ప్రభుత్వం నిషేదించింది. గతంలో కూడా ఇలాంటి అపశృతులు జరగడంతో ప్రభుత్వం ఈ వేడుకలను బ్యాన్ విధించింది.