జైషే క్యాంపుపై గురితప్పలేదు.. పాక్ పంథా మార్చుకోవాలన్న భారత్
న్యూఢిల్లి : పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే ఉగ్రవాద సంస్థపై చేసిన దాడితో పూర్తి లక్ష్యాన్ని సాధించామని ఇవాళ భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. వింగ్ కమాండర్ అభినందన్ తన మిగ్తో .. పాక్కు చెందిన ఎఫ్16 విమానాన్ని నేల కూల్చాడని, దానికి సంబంధించిన సాక్ష్యులు ఉన్నారని, ఎలక్ట్రానిక్ […]
న్యూఢిల్లి : పాకిస్థాన్లోని బాలాకోట్లో ఉన్న జైషే ఉగ్రవాద సంస్థపై చేసిన దాడితో పూర్తి లక్ష్యాన్ని సాధించామని ఇవాళ భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ ఈ విషయాన్ని ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం ఈ చర్య తీసుకుందన్నారు. వింగ్ కమాండర్ అభినందన్ తన మిగ్తో .. పాక్కు చెందిన ఎఫ్16 విమానాన్ని నేల కూల్చాడని, దానికి సంబంధించిన సాక్ష్యులు ఉన్నారని, ఎలక్ట్రానిక్ డివైస్లు కూడా ఉన్నాయన్నారు. ఆమ్రామ్ మిస్సైల్ శకలాలు తమ వద్ద ఉన్నాయని, అవే ఆధారాలు అని, పాక్ ఎయిర్ఫోర్స్ ఎఫ్16 వాడిందన్న దానికి ఇదే రుజువు అని అన్నారు. మిలిటరీ స్థావరాలపై పాక్ చేసిన దాడిలో భారత్ కేవలం ఒకే విమానాన్ని కోల్పోయినట్లు చెప్పారు. పుల్వామా దాడికి తామే కారణమని జైషే అంగీకరించినా.. పాక్ మాత్రం తమ దేశంలో ఉన్న ఉగ్ర సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. నయా పాకిస్థాన్ నయా ఆలోచనలతో వెళ్తోందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారని, కానీ ఆ దేశం ఇప్పుడు నయా యాక్షన్ చేపట్టాల్సిన అవసరం ఉందని రావీశ్ అభిప్రాయపడ్డారు.