
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది! అయితే, పండ్ల రాజాను ఆస్వాదించే ముందు మనం చేసే ఒక చిన్న పొరపాటు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మామిడి పండ్లను తినే ముందు కనీసం 30 నిమిషాల పాటు నీటిలో ఎందుకు నానబెట్టాలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు చెబుతున్న ఆసక్తికరమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ఫైటిక్ యాసిడ్ తొలగింపు: మామిడి పండ్లలో సహజంగానే ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ-న్యూట్రియెంట్ ఉంటుంది. ఇది శరీరం ఇనుము (Iron), జింక్, కాల్షియం వంటి ఖనిజాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. నీటిలో నానబెట్టడం వల్ల ఈ యాసిడ్ బయటకు వచ్చేస్తుంది.
శరీర వేడి తగ్గుతుంది: మామిడి పండు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది (Thermic effect). దీనివల్ల ముఖంపై మొటిమలు, వేడి గడ్డలు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. నానబెట్టడం వల్ల పండులోని అదనపు వేడి తగ్గి, శరీరానికి చలవ చేస్తుంది.
రసాయనాల ప్రక్షాళన: సాగు సమయంలో వాడే పురుగుల మందులు (Pesticides), పండ్లను త్వరగా పండించడానికి వాడే రసాయనాలు (Chemicals) నీటిలో నానబెట్టడం ద్వారా తొలగిపోతాయి. ఇది చర్మ అలర్జీలు, శ్వాసకోశ సమస్యల నుండి రక్షిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ: నానబెట్టిన మామిడి పండ్లను తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
మీకు సమయం ఉంటే 1 నుండి 2 గంటల పాటు నానబెట్టడం ఉత్తమం. అంత సమయం లేకపోతే కనీసం 25 నుండి 30 నిమిషాలైనా నీటిలో ఉంచడం మర్చిపోవద్దు. కేవలం రుచి కోసమే కాకుండా, పూర్తి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ చిన్న చిట్కాను పాటించండి. హ్యాపీ మ్యాంగో సీజన్!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…