
మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాలలో పేగులు ఒకటి. కానీ మనం వాటిని శుభ్రంగా ఉంచుకోవడంలో శ్రద్ధ చూపించం. కడుపు ప్రతిరోజూ శుభ్రపడుతుందని మనం అనుకుంటాం. కానీ పాత మలం పేగుల్లో ఒక సంవత్సరం వరకు పేరుకుపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పేరుకుపోయిన పాత మలం, విషపదార్థాలు వేల వ్యాధులకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.
మీకు తరచుగా ఈ సమస్యలు ఎదురైతే, మీ పేగులు మురికిగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు:
ఈ లక్షణాలు మీ పేగులు సరిగ్గా పనిచేయడం లేదని సూచిస్తాయి. పేగులు ఆహారం నుండి పోషకాలను గ్రహించి, వ్యర్థాలను బయటకు పంపే పనిని చేస్తాయి. అవి సరిగ్గా పనిచేయకపోతే, శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి.
పేగుల ఆరోగ్యం గురించి పట్టించుకోని ప్రస్తుత కాలంలో ఆరోగ్య నిపుణులు ఒక సులభమైన, చవకైన ఇంటి చిట్కా చెప్పారు. ఈ చిట్కా ద్వారా పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సులభంగా తొలగించవచ్చని అంటున్నారు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు
చిటికెడు నల్ల ఉప్పు
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు కలపండి. ఉప్పు రుచి కన్నీటి రుచిలా ఉండేలా చూసుకోండి. ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.
పేగులను శుభ్రం చేయడానికి ఇది ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందని డాక్టర్లు తెలిపారు. మీ పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవాలంటే సంవత్సరానికి కనీసం ఒక వారం పాటు ఈ చిట్కాను ప్రయత్నించాలని ఆయన సూచిస్తున్నారు. మీరు దీన్ని మరిన్ని రోజులు కూడా ప్రయత్నించవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి