Shivaratri 2022: శివరాత్రి రోజున ఈ ఆలయాలను దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం..

| Edited By: Ravi Kiran

Mar 01, 2022 | 7:56 PM

Shivaratri 2022: మహా శివరాత్రిని హిందువులు ( Maha Shivaratri 2022 ) ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. నేడు మహాశివరాత్రి పర్వదినం .. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు(Lord Shiva Temples)..

Shivaratri 2022: శివరాత్రి రోజున ఈ ఆలయాలను దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం..
Lord Shiva Temples In India
Follow us on

Shivaratri 2022: మహా శివరాత్రిని హిందువులు ( Maha Shivaratri 2022 ) ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. నేడు మహాశివరాత్రి పర్వదినం .. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు(Lord Shiva Temples) ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ రోజున శివభక్తులు శివయ్యను స్వామిని పూజించి ఉపవాసం ఉంటారు. శివపార్వతుల వివాహం జరిగిన రోజు మహాశివరాత్రిఅని భక్తుల నమ్మకం. ఈ రోజున దేశంలోని శైవ క్షేత్రాలతో పాటు, శివాలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంటుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధ, పురాతన శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి వంటి సందర్భాలలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆలయాలను సందర్శించవచ్చు. ఈ దేవాలయాలు మంచి ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. ఈ రోజు దేశంలోని ప్రసిద్ధ శివాలయ గురించి తెల్సుకుందాం..

శ్రీ సోమనాథ దేవాలయం: ఈ దేవాలయం గుజరాత్‌లో ఉంది. సోమనాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాల్లో  మొదటిదిగా పరిగణించబడుతుంది. మన దేశంలోని అనేక మంది ఆక్రమణదారులు, వివిధ పాలకులు ఈ ఆలయాన్ని  ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ఆలయం మళ్లీ మళ్లీ పునర్నిర్మించబడింది. ఈ ఆలయం కపిల, సరస్వతి , జింక అనే 3 నదుల త్రివేణి సంగమం వద్ద ఉంది.

శివోహం శివాలయం:  కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న అతి పెద్ద..  ప్రసిద్ధ చెందిన శివాలయం. ఈ శివాలయం రోజులో 24గంటలు తెరచి ఉంటుంది. మహాశివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ 65 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంది. అందమైన శివుని విగ్రహం దర్శిస్తే.. మంచి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయ సమీపంలో మానవ నిర్మిత గుహలు కూడా ఉన్నాయి, ఇవి మొత్తం 12 జ్యోతిర్లింగాలు, చార్ ధామ్‌లు దర్శనం కోసం తయారు చేయబడ్డాయి. శివోహం శివాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భజనలు, లైట్ షోలు, హారతులతో పాటు ధ్యాన సమావేశాలు నిర్వహిస్తారు.

కాశీ విశ్వనాథ శివాలయం: కాశీ విశ్వనాథ శివాలయం పవిత్ర గంగా నది ఒడ్డున ఉంది. ఆక్రమణదారులచే అనేకసార్లు ధ్వంసమవ్వడంతో.. అనేక సార్లు ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఇక్కడకు ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు.

కేదార్నాథ్ ఆలయం: ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక ప్రత్యేకమైన అనుభవం.  ఏప్రిల్ నుండి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ కేదార్‌నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని భక్తుల నమ్మకం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది ఎత్తైనది. ఆలయం లోపల, భక్తులు త్రిభుజాకార మంచుతో ఉన్న లింగాన్ని పూజిస్తారు.

Also Read:

ఇటువంటి వారు నిజంగా భూమి భారం.. ఎటువంటి ప్రయోజనం లేదంటున్న చాణక్య