
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలను ఒకే ప్యాకేజీలో సందర్శించాలని భావించే భక్తులు, పర్యాటకులకు ఇది మంచి అవకాశం. హైదరాబాద్లోని ప్రముఖ చారిత్రక కట్టడాలు, ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియంలు, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు పలు ప్రముఖ ప్రదేశాలను కవర్ చేసే ‘Spiritual Telangana with Srisailam’ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ నాలుగు రోజుల రోడ్ టూర్లో సౌకర్యవంతమైన వసతి, రవాణా, అల్పాహారం, రాత్రి భోజనంతో పాటు ప్రధాన పర్యాటక ప్రాంతాల సందర్శనను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా కాచిగూడ రైల్వే స్టేషన్లో పికప్ అనంతరం హోటల్లో చెక్-ఇన్ చేస్తారు. అనంతరం చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్లను సందర్శించే అవకాశం ఉంటుంది. రాత్రికి హైదరాబాద్లోనే బస ఉంటుంది.
ఉదయం 5 గంటలకు శ్రీశైలం బయలుదేరుతారు. అక్కడ శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలను దర్శించుకుని సాయంత్రం హైదరాబాద్కు తిరిగి చేరుకుంటారు. రాత్రి హైదరాబాద్లోనే బస ఉంటుంది.
హోటల్లో అల్పాహారం అనంతరం బిర్లా మందిర్, గోల్కొండ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించి సాయంత్రం హోటల్కు చేరుకుంటారు.
అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, సురేంద్రపురిని సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుని రైల్వే స్టేషన్లో డ్రాప్తో టూర్ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీలో ఒకటి నుంచి ఆరుగురు వరకు ప్రయాణించే వారికి ప్రత్యేక ధరలు ఉన్నాయి. స్టాండర్డ్, కంఫర్ట్ కేటగిరీల్లో డబుల్, ట్రిపుల్ ఆక్యుపెన్సీతో పాటు పిల్లలకు కూడా వేర్వేరు చార్జీలు వర్తిస్తాయి. ధరలు ఒక్కో వ్యక్తికి సుమారు రూ.12,510 నుంచి రూ.24,440 వరకు ఉంటాయి. ప్రయాణికుల సంఖ్య, గది ఎంపిక ఆధారంగా ధర మారుతుంది.
హైదరాబాద్ చారిత్రక వైభవం, శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం, యాదాద్రి దివ్య దర్శనం, సురేంద్రపురి ఆధ్యాత్మిక అనుభూతిని ఒకే టూర్లో ఆస్వాదించాలనుకునే వారికి ఈ నాలుగు రోజుల ప్యాకేజీ ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు.
ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.