Sandalwood in Summer: వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!
ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. వడ దెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే జనం భయ పడి పోతున్నారు. ఎండ కారణంగా ఉక్కపోత, చెమట, చెమట కాయలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వేసవి కూడా ఆనందంగా గడపాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే..
ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. వడ దెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 9 గంటలకే బయటకు రావాలంటే జనం భయ పడి పోతున్నారు. ఎండ కారణంగా ఉక్కపోత, చెమట, చెమట కాయలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వేసవి కూడా ఆనందంగా గడపాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. మరింత కేర్ అవసరం. ఉష్ణోగ్రత కారణంగా.. బాడీలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఎండ నుంచి ఉపశమనం పొందడంలో చందనం చక్కగా పని చేస్తుంది. చందనం శీతల స్వభావాన్ని కలిగి ఉంటుంది. చందనంతో అలసట, దాహం, రక్త పైత్యం, కఫం, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు సైతం తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా వేసవి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. వేసవిలో కలిగే అన్ని రకాల సమస్యల్ని తగ్గిస్తుంది. చందనం ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చెమట కాయలకు చెక్:
చాలా మంది సమ్మర్లో చెమట కాయలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. గంధంలో కాస్త నీళ్లు కలిపి ఒంటినిండా రాస్తూ ఉండాలి. దీని వల్ల చెమట కాయల నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరానికి కూడా చల్లగా ఉంటుంది. పిల్లలకు ఇలా రాయడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
చెమట వాసన రాదు:
వేసవి కాలంలో ఎవరికైనా సరే చెమట అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. దీని వల్ల శరీరం నుంచి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. దీన్ని కవర్ చేయడానికి చాలా మంది డియోడ్రెంట్స్, స్ప్రేలు ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా.. నీటిలో కొద్దిగా చందనం పొడి వేసి కలిపి తరచూ స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
నీళ్ల విరేచనాలు తగ్గుతాయి:
సమ్మర్లో వేడి చేయడం, ఇతరత్రా కారణాల వల్ల నీళ్ల విరేచనాలు అవడం, కడుపులో నొప్పి రావడం జరుగుతాయి. దీంతో చాలా నీరస పడిపోతారు. పిల్లల్లో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి కప్పుడు.. మంచినీటిలో గంధం పొడి, కర్పూరం సమపాలల్లో తీసుకుని కలిపి తాగితే ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు.
మూత్ర సమస్యలు:
వేసవిలో వేడి చేయడం కారణంగా చాలా మంది మూత్ర సమస్యలతో ఇబ్బంది పడతూ ఉంటారు. మూత్రం సరిగ్గా రాక.. మంటగా అనిపిస్తుంది. ఇలాంటి అప్పుడు బియ్యం కడిగిన నీటిలో.. కొద్దిగా చందన చూర్ణం, చక్కెర సమానంగా కలిపి తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..