
బయట ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుండే సూర్యుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఎండ వేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేడిని తట్టుకోలేక ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే, చాలా మంది ఏసీ ఆన్చేస్తారు.. గది కొద్దిగా చల్లబడగానే ఆపేసి, మళ్లీ ఉక్కపోతగా అనిపించగానే ఆన్ చేయడం చాలా మందికి అలవాటు. అయితే ఇలా ఏసీని పదే పదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల తీవ్ర నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తప్పక తెలుసుకోవాలి..
కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది: మనం ఏసీని ఆపేసి మళ్లీ ఆన్ చేసిన ప్రతిసారీ, గదిని తిరిగి చల్లబరచడానికి ఏసీ మోటార్ చాలా ఎక్కువ శక్తిని (Energy) ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగి, మీ నెలవారీ కరెంట్ బిల్లు ఊహించని విధంగా భారీగా పెరుగుతుంది.
కంప్రెసర్పై ఒత్తిడి – ఓవర్ హీటింగ్: ఏసీని పదే పదే ఆపడం, నడపడం వల్ల దాని ప్రధాన భాగమైన కంప్రెసర్పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇది ఓవర్ హీటింగ్ (అధిక వేడి) సమస్యకు దారితీసి, కంప్రెసర్ జీవితకాలాన్ని (Life span) తగ్గిస్తుంది.
ఆంతరింగిక విడిభాగాలు పాడవుతాయి: ఇలా పదే పదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల ఏసీలోని ఇంటర్నల్ ఎలక్ట్రికల్ విడిభాగాలు, వైరింగ్, కెపాసిటర్లు దెబ్బతింటాయి. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ వల్ల అవి కాలిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఏసీని పదే పదే ఆపే బదులు, దాన్ని ఎల్లప్పుడూ 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ స్థిర ఉష్ణోగ్రత (Temperature) వద్ద నడపడం మంచిది. ఈ ఉష్ణోగ్రత మానవ శరీరానికి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా కరెంట్ బిల్లును కూడా తగ్గిస్తుంది. మీ ఏసీ రిమోట్లో ఉండే స్లీప్ మోడ్ (Sleep Mode), ఎకో మోడ్ (Eco Mode), టైమర్ (Timer) వంటి ఫీచర్లను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఇవి గది ఉష్ణోగ్రతను బట్టి ఆటోమేటిక్గా పవర్ను అడ్జస్ట్ చేస్తాయి. అలాగే, ఏసీ ఆన్లో ఉన్నప్పుడు గది కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..