Success Story: లక్షల్లో జీతాలను వదిలి గాడిదల పెంపకాన్ని చేపట్టిన గోదారి కుర్రోళ్లు.. 20కి పైగా కంపెనీలతో ఒప్పందం.. కోట్లల్లో సంపాదన

|

Sep 30, 2022 | 4:20 PM

డాంకీ ఫామింగ్ ప్రారంభించి..దీని ద్వారా గాడిద పాలను ఉత్పత్తి చేస్తూ.. లాభాలను ఆర్జిస్తున్నారు. గోదావరి జిల్లాల యువతి,యువకులు.  ఉద్యోగం చదువు లేకపోతే గాడిదలు కాసుకోరా అనీ పెద్దవాళ్ళు అనే మాటలకి..చదువుకుని నిదర్శనంగా  వీరు నిలుస్తూ.. విజయకేతాన్ని ఎగురవేస్తున్నారు. 

Success Story: లక్షల్లో జీతాలను వదిలి గాడిదల పెంపకాన్ని చేపట్టిన గోదారి కుర్రోళ్లు.. 20కి పైగా కంపెనీలతో ఒప్పందం.. కోట్లల్లో సంపాదన
Donkey Milk Business In Kkd
Follow us on

Success story: థింక్ డిఫరెంట్ అంటూ.. గోదావరి జిల్లాలలోని యువకుల రూటే సపరేట్ అన్నట్లుగా ఉంటాయి వారి ఆలోచనలు.. మెదడుకు పదును పెట్టి ఎవరు ఎక్కడ లేని వ్యాపారాలకు శ్రీకారం చూడతారు.. అలాంటి ఊహించని వినుత్న వ్యాపారమే మొదలు పెట్టారు గోదావరి జిల్లాలోని ఓ యువకుడు.. విదేశీ చదువులు చదివానని విర్రవీగకూండా..సాప్ట్వేర్ ఉద్యోగం ఉంది కదా అని.. టెక్నాలజీ వైపు అడుగు వేయ్యకూండా.. తన ఆలోచనకు పదును పెట్టి ఆచరణలో పెట్టేశాడు.. పూర్వం రవాణాకు మాత్రమే ఎక్కువ ఉపయోగించేది, దేశంలోనే అంతరించిపోతున్న ఒక జంతువును ఎంచుకున్నారు.. తెలుగు రాష్ట్రాలలోనే మొదటి సారిగా.. ఒక వ్యాపార సముదాయంగా మార్చి, వ్యాపారం మొదలుపెట్టాడు. వినటానికి ఈవ్యాపారం పేరు కాస్తా.. అవమానంగా.. వింతగా.. ఉన్నా.. మన ఆరోగ్యాలకు,మగువల అందాల చిట్కాలకు ఎంతో మేలుచేసే.. ఆ వ్యాపారం ఏంటి..? ఆ కథ ఏంటి..? తెలుసుకుందాం..

ఆవులను, గేదెలను, మేకలను పెంచడం నిత్యం నిజ జీవితంలో మనం చూస్తూ ఉంటాము. అయితే ఓ సాఫ్ట్వేర్ ఇంజిీనీర్ దీనికి భిన్నంగా ఆలోచన చేశాడు. ప్రస్తుతం అతన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకునేలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించని గాడిదల ఫామ్ ను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం మల్లంపూడి గ్రామం లో  “అక్షయ డాంకి ఫామ్” పేరుతో సుమారు 115 విభిన్న జాతుల గాడిదల తో ఫామ్ ప్రారంభించారు. ఏకంగా సుమారు 10 ఎకరాల భూమిని తీసుకుని వాటికి అనువుగా దాణా, ఆరోగ్య సంబంధించిన మందులతో సాప్ట్ వేర్ ఇంజనీర్ తన మిత్రులతో కలసి గాడిదల ఫామ్ ను కొనసాగిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన నరాల వీర వెంకట కిరణ్ కుమార్ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అతని మైండ్ సెట్ ను మార్చాయి. కరోనా సమయంలో బాడీ లోని ఇమ్మ్యూనిటి సిస్టమ్ కోసం గాడిద పాలను తీసుకోమని వైద్యులు తనకు చెప్పారని, వాటి ధర సుమారు లీటర్ 7వేలు పైగా ఉండడంతో నేటి పాడి పరిశ్రమ రంగం లో మంచి డిమాండ్ గాడిదల పాలకు ఉండడంతో తాను వృత్తిరిత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అయినప్పటికీ ప్రస్తుతం మార్కెట్ లో గాడిద పాలకి మంచి డిమాండ్ ఉందని అందుకే తాను తన నలుగురు ఆప్త మిత్రులతో కలసి ఆరునెలలు గాడిదల జీవన విధానం, వాటి ఆరోగ్యం, దాణా.. వాటికి అనువైన ప్రదేశాల గురించి కర్నాటక లో గాడిదల కోసం శిక్షణా పూర్తి చేసుకున్నారు. అనంతరం ఈ ఫార్మ్ ను ఏర్పాటు చేశమని నిర్వాహకుల్లో ఒకరైన వెంకట్ అన్నారు. ఇందుకోసం టోక్యో బిడ్స్, గుజరాత్ హలారి బిడ్స్, మహారాష్ట్ర కాత్వాడి బ్రిడ్స్ ,ఇతోఫియ ఫారిన్ కంట్రీ బ్రీడ్స్ ను ఎంచుకున్నామని, వాటి విలువ కనీసం సుమారు యాబై వేల నుండి మూడు లక్షల వరకు మార్కెట్ ఉందని తెలిపారు. వీటి పాల ఉపయోగం ఇతర దేశాల్లో.. రాష్ట్రాల్లో అధికంగా ఉందని.. దీంతో గాడిద పాలు లీటర్ 7 వేలు నుండి ఉందని నిర్వాహకులు చెప్పారు. అంతేకాదు తాము  సాఫ్ట్వేర్ రంగాన్ని మించిన ఆదాయం ఇక్కడే సొంతా ఊరులో సంపాదించి నేటి యువకులకు ఆదర్శంగా నిలుస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ గాడిద పాలను హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాలకు రోజుకు 25 లీటర్ల వరకు కూలింగ్ కంటైనర్ ద్వారా తీసుకెళ్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు..

ఇవి కూడా చదవండి

తాము ఈ పాలను అందరికీ తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో గాడిదల ఫామ్ నీ ఏర్పాటు చేశామని నిర్వాహకురాల్లో ఒకరయిన్ భారతి అన్నారు. గాడిద పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని.. ముఖ్యంగా ఉబ్బసం వంటి వ్యాధులకు బాగా పనిచేస్తుందని. అలాగే గాడిద పాలల్లో ముసలితనం ఛాయలు దరిచేరవని తెలిపారు.  గాడిద పాలతో స్నానం చేస్తే ముసలినతం పోతుందని తెలిపారు.హైదరాబాద్ బ్యూటీ పార్లర్లో గాడిదపాలతో స్నానం చేయిస్తే 30 వేలకు పైగా తీసుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికే మా అక్షయ డాంకి ఫామ్ తో 20 కి పైగా కంపెనీలు ఒప్పందాలు గుడుర్చుకున్నయని.. గాడిద పాలను బ్యూటీ టిప్స్ తో పాటు పలు రకాల సబ్బులు, క్రీమ్స్ తయారీ సంస్థలకు విక్రయిస్తున్నామని నిర్వాహకులు భారతీ తెలిపారు.

గాడిద పాలకు ఉన్న డిమాండ్ చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆయుర్వేదంలో గాడిద పాలను ఎక్కువగా వాడుతారను ఈ యుంగర్స్ గుర్తించారు. నేరుగా పాలను తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనీ..ఈ డిమాండ్‌ను గుర్తించి రాజానగరం మళ్ళంపుడి లో దాదాపు 120 కి పైగా గాడిడలతో..వ్యాపారం లాభాల్లో సాగిస్తున్నారు. వీరిలో ఒకరు ఏకంగా ఐటీ జాబ్ వదిలేసి, మరొకరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే గాడిదలను పెంచడం మొదలెట్టారు. డాంకీ ఫామింగ్ ప్రారంభించి..దీని ద్వారా గాడిద పాలను ఉత్పత్తి చేస్తూ.. లాభాలను ఆర్జిస్తున్నారు. గోదావరి జిల్లాల యువతి,యువకులు.  ఉద్యోగం చదువు లేకపోతే గాడిదలు కాసుకోరా అనీ పెద్దవాళ్ళు అనే మాటలకి..చదువుకుని నిదర్శనంగా  వీరు నిలుస్తూ.. విజయకేతాన్ని ఎగురవేస్తున్నారు.

Reporter: Satya, TV9: Telugu

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..