
భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు సీట్ల విషయంలో గొడవలు రావడం సర్వసాధారణం. టికెట్ లేని వారు లేదా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు కన్ఫార్మ్డ్ బెర్తులను ఆక్రమిస్తుంటారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో చట్టపరంగా మీ సీటును ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139, రైల్ మదద్ యాప్ ద్వారా మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానం తెలిస్తే, మీరు ఎక్కడా గొడవ పడాల్సిన అవసరం ఉండదు. మీ స్మార్ట్ఫోన్ ద్వారా నిమిషాల్లో ఫిర్యాదు చేసే పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం.
1. 139 నంబర్కు SMS పంపే విధానం
మీరు ముందుగా ఆ ప్రయాణికుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. వినకపోతే వెంటనే మీ మొబైల్ నుంచి ఈ క్రింది ఫార్మాట్లో మెసేజ్ చేయండి:
SMS ఫార్మాట్:
SEAT <స్పేస్> PNR నంబర్ <స్పేస్> సీట్ నంబర్ <స్పేస్> OCCUPIED BY UNKNOWN PASSENGER అని టైప్ చేసి 139 కి పంపాలి.
ఉదాహరణ: SEAT 1234567890 45 Occupied by Unknown Passenger.
ప్రయోజనం: మెసేజ్ పంపిన వెంటనే ఆ ట్రైన్ టీసీ (TC)కి, రైల్వే పోలీసులకు అలర్ట్ వెళ్తుంది. వారు వచ్చి మీ సీటును మీకు ఇప్పిస్తారు.
2. రైల్ మదద్ (RailMadad) యాప్ ద్వారా..
యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు:
railmadad.indianrailways.gov.in ఓపెన్ చేసి మీ ఫోన్ నంబర్తో లాగిన్ అవ్వండి.
PNR నంబర్ ఎంటర్ చేసి, మీ ఫిర్యాదు రకాన్ని (Seat Issue) సెలెక్ట్ చేసుకోండి.
ఇన్సిడెంట్ వివరాలు రాసి ‘Proceed’ పై క్లిక్ చేస్తే రైల్వే అధికారులు వెంటనే స్పందిస్తారు.
3. RPF హెల్ప్లైన్ – 182
ఒకవేళ సీటు ఆక్రమణతో పాటు ఎవరైనా ప్రయాణికులు మీతో దురుసుగా ప్రవర్తించినా లేదా భద్రతా పరమైన సమస్యలు తలెత్తినా వెంటనే 182 నంబర్కు కాల్ చేయండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మీకు తక్షణమే రక్షణ కల్పిస్తుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అందించే ఈ నంబర్లను ప్రయాణ సమయంలో అందుబాటులో ఉంచుకోవడం మంచిది.