Weight loss tips: నెయ్యితో ఇవి తింటే ఈజీగా బరువు తగ్గుతారు..ట్రై చేసి చూడండి..

|

Sep 05, 2023 | 10:53 AM

ఇవి శరీంలో మంటను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. నెయ్యిలో వెల్లులితో పాటుగా లవంగాలు కూడా కలిపి తీసుకోవచ్చు. లవంగాలను కొద్దిగా వేడి చేసి,. ఆ తర్వాత అందులో వెల్లులి, నెయ్యి కలపాలి, కొన్ని గంటల పాటు నానిన తర్వాత వాటిని వడగట్టాలి, ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Weight loss tips: నెయ్యితో ఇవి తింటే ఈజీగా బరువు తగ్గుతారు..ట్రై చేసి చూడండి..
Follow us on

నెయ్యి తింటే శరీర బరువు పెరుగుతుందని చాలా మంది తప్పుగా నమ్ముతారు. అయితే ఇది నిజం కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్నింటిని నెయ్యితో కలిపి తింటే బరువు తగ్గడంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యి తింటే బరువు పెరిగే ప్రమాదమే లేదు. నెయ్యితో ఏయే పదార్థాలను కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

దాల్చిన చెక్కతో నెయ్యి..

దాల్చిన చెక్కలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెయ్యితో వాడితే దాని ప్రభావం పెరుగుతుంది. పాన్‌లో నెయ్యి వేసి అందులో కొద్దిగా దాల్చిన చెక్క వేసి 4 నుంచి 5 నిమిషాలు వేడి చేసి ఆ తర్వాత పొడి చేసుకుని వాడినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి.

ఇవి కూడా చదవండి

పసుపుతో నెయ్యి..

పసుపు యాంటీ బ్యాక్టీరియల్. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పసుపును నెయ్యితో కలిపి తీసుకుంటే శరీరంలోని అన్ని రకాల మంటలు తగ్గుతాయి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు నెయ్యి, 1 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ ఎండుమిర్చి పొడి వేసి బాగా మిక్స్ చేసి గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఒక స్పూన్‌ చొప్పున తీసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి.

తులసితో నెయ్యి..

తులసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది. నెయ్యితో ఒక కొన్ని తులసి ఆకులను వేసి వాడండి. ఇలా చేస్తే తులసి నెయ్యి మిశ్రమం మరింత పోషక విలువలను కూడా కలిగిస్తుంది.

నెయ్యితో కర్పూరం..

కర్పూరం చేదు, తపీ రుచులకు కలిగి ఉంటుంది. కర్పూరం తీసుకోవడం వల్ల వాతా పిత సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. జీర్ణ శక్తిని పెంచుతుంది. పొట్టలో నులి పురుగులను చంపేస్తుంది. జ్వరం తగ్గుతుంది. కర్పూరం కలిపిన నెయ్యి కోసం 1-2 ముక్కలు తినే కర్పూరాన్ని నెయ్యిలో వేసి 5 నిమిషాలు వేడి చేసి వాడుకోవాలి.

నెయ్యితో వెల్లుల్లి..

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నెయ్యిలో వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయి. ఇవి శరీంలో మంటను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. వెల్లులితో పాటు లవంగాలు కూడా నెయ్యితో కలిపి తింటే మంచిది. ఇందుకోసం లవంగాలను కొద్దిగా వేడి చేసి,. ఆ తర్వాత అందులో వెల్లులి, నెయ్యి కలపాలి, కొన్ని గంటల పాటు నానిన తర్వాత వాటిని వడగట్టాలి, ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..