
రామ నవమి పండుగను భారతదేశంలో భక్తిశ్రద్ధలతో చాలా ఘనంగా జరుపుకుంటారు. శ్రీరాముడి జన్మదినోత్సవంగా శ్రీరామనవమిని దేశమంతటా ఘనంగా నిర్వహిస్తారు. రామాయణంతో సంబంధం ఉన్న అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం, భద్రాచలం వంటి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం అయోధ్యలో విశేషమైన ఉత్సవాలు జరగబోతున్నాయి.
బెంగళూరులో కూడా రామ నవమిని ఘనంగా జరుపుకుంటారు. రామ నవమి నాడు అక్కడి భక్తులకు పానకం, మజ్జిగ, ఇతర ప్రసాదాలను పంపిణీ చేస్తారు. పానకం ఈ రోజున ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అయితే ఈ రోజున పానకం, పెసరపప్పు కొసంబరి వంటి సంప్రదాయ నైవేద్యాలు తయారు చేస్తారు. కొన్ని వంటకాల్లో కొద్దిగా మిరియాలు, వంట కామ్ఫర్ కలుపుతారు. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
పానకం శ్రీరాముడికి ప్రీతికరమైన మధురపానీయం.. వేసవి కాలంలో ఈ పానకం తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి. దాహార్తిని తీర్చేందుకు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించేందుకు పానకం ఒక గొప్ప వంటకం. ఇది బెల్లం, అల్లం, యాలకులతో తయారవుతుంది.
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో బెల్లాన్ని వేసి తగినన్ని నీరు పోసి పూర్తిగా కరిగే వరకు బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడగట్టి మిగిలిన అపరిశుద్ధాలను తొలగించాలి. అనంతరం అందులో నిమ్మరసం, అల్లం పొడి, వంట కామ్ఫర్ వేసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు పానకాన్ని ముందుగా శ్రీరాముడికి నివేదించి ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులతో కలిసి సేవించండి.
ఆరోగ్యకరమైన నైవేద్యం పెసరపప్పు కొసంబరి.. ఈ ఆరోగ్యకరమైన సలాడ్ రామ నవమి ప్రత్యేకతగా ప్రసిద్ధి చెందింది. వేసవి కాలంలో శరీరానికి తేమను అందించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కూరగాయలు, నిమ్మరసం, కొబ్బరి తురుము, తగిన మసాలాలు కలిపి తయారు చేస్తారు. తేలికగా అరిగే ఈ సలాడ్ ఆరోగ్యానికి మంచిదే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ప్రత్యేకంగా వేడిని తగ్గించే గుణాలున్న కీరా వంటి పదార్థాలతో దీనిని తయారు చేయడం వల్ల వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు కొసంబరిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి 1 గంట పాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం నీటిని పూర్తిగా వడగట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగతా పదార్థాలను అందులో వేసి బాగా కలపాలి. రుచికి తగినంత ఉప్పు, నిమ్మరసం జోడించి మిక్స్ చేయాలి. చివరిగా ఒక చిన్న పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఎండు మిర్చి వేసి పోపు సిద్ధం చేయాలి. ఈ పోపును సిద్ధం చేసిన పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పెసరపప్పు కొసంబరిని ముందుగా శ్రీరాముడికి నివేదించి ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులతో కలిసి సేవించండి.