
సాధారణ పూరీలకు బదులుగా ఆలూ పూరీని తయారు చేస్తే ప్రత్యేకంగా కూర అవసరం లేకుండానే రుచిగా ఆస్వాదించవచ్చు. పెరుగు, పచ్చడి లేదా టీతో కలిపి తింటే వర్షపు ఉదయాన్ని మరింత ఆస్వాదించొచ్చు.
కావాల్సిన పదార్థాలు:
గోధుమపిండి
ఉడికించిన ఆలుగడ్డలు
జీలకర్ర
వాము
కారం
పసుపు
ఉప్పు
కొత్తిమీర
నూనె
పిండి ఇలా కలపండి
ఉడికించిన ఆలుగడ్డలను మెత్తగా చేసి గోధుమపిండిలో కలపాలి. అందులో జీలకర్ర, వాము, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసి గట్టిగా పిండి కలపాలి. అవసరమైతే మాత్రమే కొద్దిగా నీరు వేయాలి.
వేయించేటప్పుడు ఈ టిప్ పాటించండి
చిన్న ఉండలుగా చేసి కొద్దిగా మందంగా వత్తి, బాగా వేడైన నూనెలో వేయిస్తే పూరీలు చక్కగా పొంగి కరకరలాడుతాయి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
వర్షపు రోజుల్లో ఎందుకు బెస్ట్?
వేడి వేడిగా చేసిన ఆలూ పూరీ చల్లటి వాతావరణంలో తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఉదయం అల్పాహారంగా మాత్రమే కాకుండా సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఆస్వాదించవచ్చు. పుదీనా చట్నీ లేదా పెరుగుతో తింటే రుచి మరింత పెరుగుతుంది.