Pulichinta Leaves: చిట్టి చిట్టి ఆకులతో పెరిగే పులిచింతతో అనారోగ్య చింతలన్నీ మటుమాయం..!

|

Jun 09, 2023 | 1:43 PM

అంతే కాకుండా ఈ ఆకులను పప్పుగా వండుకొని తింటున్న కూడా చక్కటి ఫలితం కలుగుతుంది. వాతం తగ్గించడానికి ఈ ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులను, సొంటి, నెయ్యి, తేనె సమాన మోతాదు లో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. ఈ ఆకులతో మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేస్తారు. శ్వాస సమస్యలను తొలగిస్తుంది. నిద్రలేమికి మేలు చేస్తుంది.

Pulichinta Leaves: చిట్టి చిట్టి ఆకులతో పెరిగే పులిచింతతో అనారోగ్య చింతలన్నీ మటుమాయం..!
Pulichinta Leaves
Follow us on

Pulichinta Leaves: ఈ ప్రకృతి మనకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అంటారు. ఎందుకంటే.. మన ప్రకృతిలో ఉండే… ఎన్నో మొక్కలు వాటిలో మనకు అనేక రకాల ఉపయోగపడతాయి. ప్రతి మొక్కల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అటువంటి కోవకు చెందినది పులి చింత మొక్క.. వర్షాకాలంలో ఈ మొక్క విరివిగా పెరుగుతుంది. మన ఇంట్లో పెంచుకుంటున్న పూల కుండీల్లోనూ ఈ మొక్క పెరిగి నిండుగా పాకుతుంది. ఈ ఆకులను పప్పు పులుసు కూర వండుకుని తింటారు.. పులి చింత ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఈ చిట్టి చిట్టి ఆకుల్లో ఇంత మహాత్తరం దాగి ఉందని నోరెళ్ల బెడతారు.

ఈ తీగ జాతి మొక్క ఆకులు నమిలి తింటే పుల్లగా ఉంటాయి అందుకే వీటికి పులి చింత అని పేరు వచ్చింది.. ఈ పులి చింత ఆకులను తినటం వలన ముక్కు, గొంతు, మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుంది. గొంతు సంబంధిత రోగాలను అరికడుతుంది. ఈ ఆకులను ముద్దగా నూరి రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి. అంతే కాకుండా ఈ ఆకులను పప్పుగా వండుకొని తింటున్న కూడా చక్కటి ఫలితం కలుగుతుంది. వాతం తగ్గించడానికి ఈ ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులను, సొంటి, నెయ్యి, తేనె సమాన మోతాదు లో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. ఈ ఆకులతో మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేస్తారు. శ్వాస సమస్యలను తొలగిస్తుంది. నిద్రలేమికి మేలు చేస్తుంది, కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు రాలిపోతాయి. పులిచింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు గట్టిపడతాయి. పులిచింత మొక్క వేళ్లను నీడన ఎండించి పొడి చేసి పండ్ల పొడిగా వాడినా చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

సైందవ లవణం చేర్చిన పులిచింత ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే చాలా త్వరగా విషం దిగిపోతుంది. పులిచింత ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత తగ్గుతుంది. 40 నుంచి 60 మి.లీ ఆకు రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. ఈ ఆకులను కూరగా, పచ్చడిగా వండుకుని తింటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…