
నేటి బిజీ డిజిటల్ యుగంలో ఆఫీసు పని ఒత్తిడి, ఒంటరిగా నివసించడం లేదా ఫోన్లు చూస్తూ తినే అలవాటు వల్ల చాలామంది ఒంటరిగానే భోజనం చేస్తున్నారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో మన మెదడు ఆరోగ్యం, మానసిక స్థితిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
డిప్రెషన్ మరియు ఏకాంత భావన : ఆహారం అనేది కేవలం కడుపు నింపుకోవడానికే కాకుండా అనుబంధాలను పంచుకోవడానికి కూడా ఒక వేదిక. ఒంటరిగా తిన్నప్పుడు మనుషులలో ఎవరూ లేరనే భావన పెరిగి, అది క్రమంగా డిప్రెషన్కు దారితీసే ప్రమాదం ఉంది.
హార్మోన్ల అసమతుల్యత: మనసుకి ఇష్టమైన వారితో లేదా కుటుంబంతో కలిసి తిన్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్, సెరోటోనిన్ వంటి ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు విడుదలవుతాయి. ఒంటరిగా తిన్నప్పుడు ఇవి లోపించి, ఒత్తిడిని కలిగించే ‘కార్టిసోల్’ హార్మోన్ స్థాయి పెరుగుతుంది.
అనారోగ్యకరమైన తిండి అలవాట్లు: ఒంటరిగా తినేవారు తరచుగా టీవీ లేదా మొబైల్ చూస్తూ తింటారు. దీనివల్ల ఎంత తింటున్నామనే స్పృహ ఉండదు . ఇది అధిక బరువు లేదా ఆకలి తగ్గకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
మెదడు చురుకుదనం తగ్గడం: నలుగురితో కలిసి మాట్లాడేటప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒంటరిగా భోజనం చేయడం వల్ల సామాజిక పరస్పర చర్యలు తగ్గి, మానసిక ఉత్సాహం నశిస్తుంది.
కుటుంబంతో కలిసి తినడం: కనీసం రాత్రి భోజనమైనా కుటుంబ సభ్యులతో కలిసి తినడానికి ప్రయత్నించండి.
ఆఫీసులో లంచ్ బ్రేక్: ఆఫీసులో మీ డెస్క్ వద్ద ఒంటరిగా కాకుండా, సహోద్యోగులతో కలిసి కాఫెటీరియాలో భోజనం చేయండి.
స్క్రీన్లకు దూరంగా ఉండండి: ఒకవేళ ఒంటరిగా తినాల్సి వచ్చినా ఫోన్ లేదా టీవీ చూడటం మానేసి, ఆహారంపై శ్రద్ధ చూపుతూ మైండ్ఫుల్గా తినండి.
భోజనాన్ని కేవలం ఆహారంగా కాక, సంబంధాలను బలపరిచే ఒక అవకాశంగా మార్చుకోవడం వల్ల మానసికంగా ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..