Throat Pain : గొంతునొప్పితో బాధపడుతున్నారా..! అయితే ఈ పండ్లు తినండి..? మంచి ఉపశమనం దొరుకుతుంది..

Throat Pain : సాధరణంగా సీజన్ మారినప్పుడు గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలతో అందరూ

Throat Pain : గొంతునొప్పితో బాధపడుతున్నారా..! అయితే ఈ పండ్లు తినండి..? మంచి ఉపశమనం దొరుకుతుంది..
Throat Pain

Edited By:

Updated on: Jun 07, 2021 | 8:13 AM

Throat Pain : సాధరణంగా సీజన్ మారినప్పుడు గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలతో అందరూ బాధపడుతుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సమయంలో ఈ వ్యాధుల ప్రభావం మరీ ఎక్కువైంది. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా వెంటనే కరోనా వచ్చిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధరణంగా చలికాలంలో ఈ సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే గొంతు నొప్పిని తక్షణమే తగ్గించుకోవడానికి ఈ పండ్లు తింటే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

1. పైనాపిల్ తినడం వల్ల గొంతు నొప్పి తగ్గి చాలా ఉపశమనం కలుగుతుంది.
2. మల్బరీ యాంటీపైరెటిక్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు వీటిని ఎక్కువ సేపు నమిలితే ప్రయోజనం ఉంటుంది.
3. పాలకూర ఆకులను ఉడకబెట్టి, నీటిని వడపోయండి. ఈ నీటిలో కొద్దిగా అల్లం రసం కలిపి గార్గిల్ చేస్తే గొంతు నొప్పి పూర్తిగా మాయమవుతుంది.
4. గొంతు నొప్పి నయం చేయడానికి వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
5. ఒక గ్లాసు నీటిని తీసుకొని దానిలో 4 నుంచి 5 అంజీరలను వేసి వడపోసి వేడి చేయండి. దీనిని ఉదయం, సాయంత్రం త్రాగండి. ఇలా చేయడం వల్ల మీ గొంతు నొప్పి పోతుంది.
6. తొమ్మిది-పది మిరియాలు తీసుకొని గ్రైండ్ చేసి తరువాత నెయ్యి లేదా చక్కెర సిరప్ తో నాకండి మంచి ఉపశమనం ఉంటుంది.

ఇవి కాకుండా.. మన వంటింట్లో అల్లం, బెల్లం, మాసాలా దినుసులను కలిసి కషాయంగా చేసుకొని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇందులో లవంగాలు, నల్ల మిరియాలు, యాలకులు, అల్లం, బెల్లం వేసి కాసేపు వేడి చేసి తీసుకోవడం వలన గొంతు నొప్పి, దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, టూస్పూన్ అల్లం, నల్ల ఉప్పు, పసుపు, నల్ల మిరియాలు, 5-6 తులసి ఆకులను వేసి కషాయంగా చేసుకోవాలి. దీనిని తాగడం వలన చాతి నొప్పి, జలుబు సమస్యలను నుంచి త్వరగా కోలుకుంటారు.

Follow Us