
శారీరక అనారోగ్యాన్ని మందులతో నయం చేయవచ్చు. కానీ మానసిక అనారోగ్యానికి ఎలాంటి మందులతో నయం చేయలేం. ఇటీవలి కాలంలో ప్రతీచోట మానసిక అనారోగ్యాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. దీనిపై తగినంత అవగాహనతో మసలుకుంటే ప్రమాదం అంచుదాకా వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీనిపై అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయి. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ డేటా ప్రకారం భారతదేశంలో 60 శాతం మానసిక అనారోగ్యాలు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే కనిపిస్తున్నాయనే దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించింది. దీని డేటా మాలిక్యులర్ సైకియాట్రీ జర్నల్లో ప్రచురించబడింది. కాబట్టి చిన్న వయస్సులోనే మానసిక ఆరోగ్యం క్షీణించడానికి కారణం ఏమిటి? మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏమి చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
పరిశోధన ప్రకారం.. 34.6 శాతం మానసిక రుగ్మతలు 14 ఏళ్లలోపు, 48.4 శాతం 18 ఏళ్లలోపు, 62.5 శాతం 25 ఏళ్లలోపు ప్రారంభమవుతాయి. చాలా మంది రోగులకు, మానసిక రుగ్మతలు యుక్తవయస్సు రాకముందే ప్రారంభమై క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 25 ఏళ్లు పైబడిన వారిలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD), ఆందోళన, నిరాశ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ కేసులు కూడా మునుపటి కంటే చిన్న వయస్సులోనే ప్రారంభమవుతున్నాయి. సరిగ్గా చికిత్స చేయకపోతే తీవ్రంగా మారవచ్చు.
సాధారణంగా మన దేశంలో చిన్న వయస్సులోనే మానసిక వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణం సకాలంలో చికిత్స లేకపోవడం. ఈ పరిస్థితుల గురించి తగినంత అవగాహన లేకపోవడమే. కౌమారదశలో ప్రారంభమయ్యే మానసిక వ్యాధులకు చికిత్స చేయకపోతే, అవి జీవితాంతం వ్యాపించే అంటువ్యాధిగా మారవచ్చు. ఇది వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.