కొవిడ్ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ లోని 111 కొవిడ్ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా వర్క్ చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. జాబ్స్ కోసం దాదాపు 10 వేల మంది అప్లై చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని 111 కొవిడ్ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా వర్క్ చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. జాబ్స్ కోసం దాదాపు 10 వేల మంది అప్లై చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మొదటి విడతలో వీరిని ఆరోగ్య శాఖ అధికారులు ఎంపిక చేశారు. వాలంటీర్లుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్న వారు కొవిడ్ యాప్ ద్వారా లేదా covid-19info@ap.gov.in మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం యుద్ద ప్రాతపదికన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కేసుల తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటికే టెస్టులు విషయంలో ముందున్న ఏపీ సర్కార్..తాజాగా జిల్లాకో కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతుంది. ఈ సెంటర్ల ద్వారా కరోనా లక్షణాలు ఉన్నావారు, అనుమానితులు..కోవిడ్-19కు సంబంధించిన సమాచారం, సేవలు పొందొచ్చు.