విజయ్ సేతుపతి హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ సినిమా.?

|

Jun 06, 2020 | 4:34 PM

వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న 'ఉప్పెన' సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సేతుపతి విలన్ రోల్‌లో కనిపించనున్నారని టాక్.

విజయ్ సేతుపతి హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ సినిమా.?
Follow us on

వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘ఉప్పెన’ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సేతుపతి విలన్ రోల్‌లో కనిపించనున్నారని టాక్. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ అరవ హీరో త్వరలోనే ఓ స్ట్రెయిట్ తెలుగులో సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, విజయ్ సేతుపతి గతంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రేక్షకులను మెప్పించిన సంగతి విదితమే.