గుర్తుతెలియని మహిళను గొంతు కోసి చంపిన దుండగులు

|

Oct 29, 2020 | 11:26 AM

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఓ వివాహిత మహిళ (30) దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన చనుగోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

గుర్తుతెలియని మహిళను గొంతు కోసి చంపిన దుండగులు
Follow us on

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఓ వివాహిత మహిళ (30) దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన చనుగోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌-బీజాపూరు హైవే రోడ్డు రాకంచర్ల ఇండస్ట్రియల్‌ సమీపంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. హత్య చేసిన మహిళను హైవే రోడ్డు కల్వర్టు దగ్గర ఉన్న నీటి కుంటలో పడేసి వెళ్లారు దుండగులు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఒంటిపై ఆరంజ్‌ కలర్‌ స్కర్ట్‌, బ్లాక్‌ కలర్‌ టాప్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. జరిగిన ఘటన తెలుసుకున్న పరిగి డీఎస్పీ సందర్శించి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.