లారీ బోల్తాపడి ఇద్దరు మృతి

|

Sep 21, 2020 | 7:42 PM

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండలం గోకపసులబాద్ శివారులో రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

లారీ బోల్తాపడి ఇద్దరు మృతి
Follow us on

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండలం గోకపసులబాద్ శివారులో రోడ్డుప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గోకపసులబాద్ గ్రామ సమీపంలో వేగంగా వచ్చిన లారీమూలమలుపులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రావుల పల్లి గ్రామానికి చెందిన నర్సప్ప (38) అబ్దుల్ (35)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.