హత్రాస్ కేసు నిందితుల్లో ఒకడు ఆ గ్రామంలోనే లేడట !

| Edited By: Pardhasaradhi Peri

Oct 03, 2020 | 8:48 PM

హత్రాస్ కేసు నిందితుల్లో  ఒకడైన రాము అనే వ్యక్తి నేరం జరిగిన రోజున గ్రామంలోనే లేడని అతడు పని చేస్తున్న పాల ప్లాంట్ యజమాని చెప్పాడు. నేరం జరిగిన సెప్టెంబరు 14 న రాము రెండు షిఫ్తుల్లో..

హత్రాస్ కేసు నిందితుల్లో ఒకడు ఆ గ్రామంలోనే లేడట !
Follow us on

హత్రాస్ కేసు నిందితుల్లో  ఒకడైన రాము అనే వ్యక్తి నేరం జరిగిన రోజున గ్రామంలోనే లేడని అతడు పని చేస్తున్న పాల ప్లాంట్ యజమాని చెప్పాడు. నేరం జరిగిన సెప్టెంబరు 14 న రాము రెండు షిఫ్తుల్లో పని చేశాడని ఆయన తెలిపాడు. పైగా తన ప్లాంట్ లో పని చేసే మరో పాతిక మంది కార్మికులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారన్నారు. ఆ రోజు ఉదయం మొదట ఓ షిఫ్ట్ లోను, సాయంత్రం మరో షిఫ్ట్ లోను రాము పని చేశాడని, మూడు నెలల క్రితమే అతడు పనిలో చేరాడని ఆ యజమాని చెప్పాడు. ఇది ఈ కేసులో ఓ ట్విస్ట్ గా మారింది. బాధితురాలిపై నలుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు.