టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతికి చింతిస్తూ హీరో కృష్ణ, నరేష్లను పరామర్శించి తన సంతాపాన్ని తెలిపారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు చిత్రసీమకు విజయనిర్మల చేసిన సేవలు మరువలేనివని, ఆమె స్థానం భర్తీ చేయలేనిదని విచారం వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ అక్కడ ఉన్న సమయంలోనే హీరో మహేష్ బాబు కూడా అక్కడికి వచ్చారు.
సీనియర్ నటి దర్శకురాలు విజయనిర్మల గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆమెకు అంత్యక్రియలు జరిగాయి.