శింబు- త్రిష పెళ్లట..!

|

Jul 22, 2020 | 1:21 PM

త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సోషల్ మీడియాలో ఇప్పడు ఇదే పెద్ద హాట్ హాట్ టాపిక్. త్రిష, తమిళ హీరో శింబు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందా? వీరిద్దరు త్వరలో పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నారా? ఇవే ఇప్పుడు సోషల్ మీడియా...

శింబు- త్రిష పెళ్లట..!
Follow us on

త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సోషల్ మీడియాలో ఇప్పడు ఇదే పెద్ద హాట్ హాట్ టాపిక్. త్రిష, తమిళ హీరో శింబు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందా? వీరిద్దరు త్వరలో పెళ్లిపీటలెక్కడానికి సిద్ధమవుతున్నారా? ఇవే ఇప్పుడు సోషల్ మీడియా హెడ్డింగ్స్… అయితే 2015లో బిగ్ బిజినెస్‌మెన్ వరుణ్‌మణియన్‌తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అనంతరం కొద్దివారాలకే తాము పెళ్లిచేసుకోవడం లేదని ప్రకటించారు. వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉండాలని వరుణ్‌మణియన్‌ షరతులు  పెట్డంతో త్రిష తిరష్కరిచింది. దీంతో ఆ జంట విడిపోయారని వార్తలొచ్చాయి.

ఆ తర్వాత కొన్నేళ్లపాటు రానాతో ప్రణయబంధాన్ని కొనసాగించింది త్రిష. తాజాగా ఈ అమ్మడు శింబును పెళ్లాడబోతుందనే వార్త తమిళ చిత్రసీమలో పెద్ద చర్చగా మారింది. శింబు-త్రిష కలిసి ‘వినైతాండి వరువాయ’ వంటి విజయవంతమైన చిత్రంలో నటించారు. ఇటీవలే ఈ జంట కలిసి నటించిన లఘు చిత్రం ‘కార్తిక్‌ డయల్‌ సేతా యెన్‌’కు మంచి ఆదరణ లభించింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి బంధం బలపడిందని చెబుతున్నారు. ఈ వివాహ వార్తలపై శింబు ఇప్పటివరకు స్పందించలేదు. త్రిష కూడా మౌనంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ జంట పెళ్లి వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు వివరణ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. గతంలో హన్సిక, నయనతారతో లవ్‌ఎఫెర్స్‌ నడిపిన శింబు కొన్నేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నారు.