మహానగనరంలో గణేశ్ నిమజ్జనానికి రంగం సిద్దమైంది. వివిధ రూపాల్లో పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులు కొద్ది గంటల్లో బైబై చెప్పనున్నారు. హైదరాబాద్ అన్ని వైపుల నుంచి విగ్రహాలు బాలాపూర్ గణేష్తో కలిసి మెయిన్ రోడ్లో పయనించి హుస్సేన్ సాగర్లో మంగళవారం నిమజ్జనం కానున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్బండ్ వద్ద 21 క్రేన్లను సిద్ధం చేశారు అధికారులు. ఇక ఖైరతాబాద్ గణపతి ఊరేగింపు ఉదయం పదిన్నరకు ప్రారంభమై, మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.
వినాయక ఊరేగింపు, నిమజ్జనం నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఇవి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు
ప్రజలు, భక్తులు సమాచారం కోసం 040-2785 2482, 9010203626
Also Read :