గుడినే బార్ గా మార్చిన ఉద్యోగులు

ఆలయాన్నే బార్ గా మార్చేరు ఉద్యోగులు. దేవాల‌య ప్రాంగ‌ణంలో ఓ ఇద్ద‌రు సిబ్బంది మ‌ద్యం సేవించి అడ్డంగా బుక్క‌య్యారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని విరుద‌చ‌లంలో ఆదివారం చోటు చేసుకుంది.

గుడినే బార్ గా మార్చిన ఉద్యోగులు

Updated on: Aug 16, 2020 | 4:04 PM

ఆలయాన్నే బార్ గా మార్చేరు ఉద్యోగులు. దేవాల‌య ప్రాంగ‌ణంలో ఓ ఇద్ద‌రు సిబ్బంది మ‌ద్యం సేవించి అడ్డంగా బుక్క‌య్యారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని విరుద‌చ‌లంలో ఆదివారం చోటు చేసుకుంది. విరుద‌చ‌లంలోని శ్రీ కొల‌న్ జీయాప్ప‌ర్ దేవాల‌యాన్ని లాక్‌డౌన్ కార‌ణంగా మూసివేశారు. ప్ర‌స్తుతం ఆ ఆల‌యంలో కేవ‌లం అత్యవసర పూజలు మాత్రమే కొనసాగుతున్నాయి.ఇందుకు పూజారుల‌ను, కొందరు సిబ్బందిని మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. అయితే, ఆదివారం ఉద‌యం ఇద్ద‌రు సిబ్బంది.. ఆల‌యంలోని నంద‌నవ‌నంలో కూర్చుని మ‌ద్యం సేవించారు. అంతేకాదు దేవాలయం ప్రాంగణంలోకి మాంసం కూడా తీసుకువచ్చి తిన్నారు. ఈ దృశ్యాల‌ను కొంద‌రు చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు.

కాగా, దీనిపై దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. మ‌ద్యం సేవించిన వ్య‌క్తుల‌ను పుల‌వార్ శివ‌రాజ‌న్, వాచ్‌మెన్ శివ‌కుమార్‌గా అధికారులు గుర్తించారు. వీరిద్ద‌రిని విధుల నుంచి స‌స్పెండ్ చేసినట్లు ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు చెప్పారు. ఇదిలావుంటే ఈ ఆల‌యంపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆలయ ప్రాంగణలో ఉండే 9 మ‌చ్చ‌ల జింక‌లు అనుమానాస్పదంగా చ‌నిపోయాయి. ఆల‌య ప‌రిపాల‌న విభాగం మొత్తం 21 మ‌చ్చ‌ల జింక‌ల‌ను పెంచుతుంది. మరోవైపు అలయ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపలు వెలువడుతున్నాయి.