హైకోర్టు పనులు యథావిధిగా కొనసాగుతాయి: రిజిస్ట్రార్ జనరల్

| Edited By:

Jul 08, 2020 | 10:56 PM

తెలంగాణ హైకోర్టు మూసివేతపై వార్తలను హైకోర్టు రిజిస్ట్రార్ ఖండించారు. హైకోర్టు పనులు యథావిధిగా కొనసాగుతాయని రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగుతోందని రిజిస్ట్రార్

హైకోర్టు పనులు యథావిధిగా కొనసాగుతాయి: రిజిస్ట్రార్ జనరల్
Follow us on

తెలంగాణ హైకోర్టు మూసివేతపై వార్తలను హైకోర్టు రిజిస్ట్రార్ ఖండించారు. హైకోర్టు పనులు యథావిధిగా కొనసాగుతాయని రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగుతోందని రిజిస్ట్రార్ తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ జనరల్‌ హెచ్చరించారు. గురువారం నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారని, హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ ఖండించారు.

Also Read: బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..