దోస్త్‌-2020 షెడ్యూల్ రెడీ..!

|

Jun 12, 2020 | 4:34 PM

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నది.

దోస్త్‌-2020 షెడ్యూల్ రెడీ..!
Follow us on

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్‌ విడుదల కానున్నది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌-2020) అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ రూపొందించే పనిలో పడ్డారు అధికారులు. 2020-21 విద్యాసంవత్సరానికి జూలై, ఆగస్టులో దశవారీగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్ారు. డిగ్రీ ఆడ్మిషన్లను చేపట్టి ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు.
యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్‌ ఒకటి నుంచి, ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను ఆగస్టు ఒకటినుంచి ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్ మీడియాను ఉపయోగించనున్నారు. ఇక కాలేజీలను ఎప్పుడు తెరుస్తారన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్ఫష్టత ఇవ్వనుంది.