పీకేను సంప్రదించలేదు – సీఎం రమేష్

|

Jun 15, 2019 | 7:05 AM

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీడీపీ సంప్రదింపులు జరిపారంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. అటు టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారడంలేదని.. పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని.. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదన్నారు. కాగా త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా టీడీపీ తరపున గెలిచిన […]

పీకేను సంప్రదించలేదు - సీఎం రమేష్
Follow us on

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీడీపీ సంప్రదింపులు జరిపారంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. అటు టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారడంలేదని.. పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని.. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదన్నారు. కాగా త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు మొదలుకానున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా టీడీపీ తరపున గెలిచిన కీలక నేతలందరూ కూడా త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సీఎం రమేషే అందులో మొదటివాడని పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఆయనే ఈ పుకార్లు‌పై ఓ క్లారిటీ ఇవ్వడంతో.. దీనికి ఫుల్‌స్టాప్ పడిందని చెప్పాలి.