శ్రీశైలం ఆలయంపై కరోనా ప్రభావం.. మరో ఐదు రోజులు దర్శనాలు బంద్..

|

Aug 10, 2020 | 7:41 PM

కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

శ్రీశైలం ఆలయంపై కరోనా ప్రభావం.. మరో ఐదు రోజులు దర్శనాలు బంద్..
Follow us on

Srisailam Temple Darshans: కర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఐదు రోజుల పాటు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా కేసులు ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే గత 25 రోజులుగా దర్శనాలను నిలిపేసిన అధికారులు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అటు ఏపీలో కరోనా కేసులు రెండు లక్షల మార్క్ దాటిన విషయం విదితమే.

Also Read:

ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..