పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…

|

Sep 12, 2020 | 7:16 PM

సాయానికి మరో పేరుగా మారిపోయిన సోనూ.. తాజాగా పేద విద్యార్ధుల కోసం తన దివంగత తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంను రూపొందించాడు.

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్...
Follow us on

Sonu Sood Offers Scholarship: ఎక్క‌డ ఆప‌ద ఉన్నా క్ష‌ణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తున్నాడు. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రీల్ విలన్‌ నుంచి యావత్ భారతదేశానికి రియల్‌ హీరోగా మారిపోయాడు నటుడు సోనూసూద్. సాయానికి మరో పేరుగా మారిపోయిన సోనూ.. తాజాగా పేద విద్యార్ధుల కోసం తన దివంగత తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంను రూపొందించాడు.

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల చెందిన నిరుపేద విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించాడు. వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెందిన, మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. 10 రోజుల్లో తమ వివరాలను scholarships@sonusood.me మెయిల్‌కు పంపాలని సోనూ పేర్కొన్నాడు.

దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ”గడిచిన కొద్దినెలలలో నిరుపేద కుటుంబాలు తమ పిల్లల చదువు కోసం ఎలా కష్టపడుతున్నారో నేను చూశాను. కొంతమందికి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి ఫోన్లు లేవు, మరికొందరికి ఫీజు చెల్లించడానికి డబ్బు లేదు. కాబట్టి, నా తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో స్కాలర్‌షిప్‌లను అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. మోగా(పంజాబ్)లో ఆమె ఎంతోమంది పిల్లలకు ఉచితంగా పాఠాలు బోధించేవారు. ఆ ప్రేరణతోనే.. ఆమె చేసిన మంచి పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. అని సోనూసూద్ పేర్కొన్నాడు.

Also Read: 

”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”

ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే