Crime News: పడగవిప్పిన పైశాచికత్వం.. కౌగిలింతలో కాలిబూడిదైన ప్రేమ.. అసలు ఏమైందంటే.!
Crime News: ప్రియురాలిని చంపాలనున్నాడు.. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెకు నిప్పంటించాడు.. అంతా బాగానే ఉందనుకున్నాడు ఆ దుర్మార్గుడు....
Crime News: ప్రియురాలిని చంపాలనున్నాడు.. పక్కా ప్లాన్ ప్రకారం ఆమెకు నిప్పంటించాడు.. అంతా బాగానే ఉందనుకున్నాడు ఆ దుర్మార్గుడు.. కానీ కథ అడ్డం తిరిగింది. వంచనకు గురిచేసిన దగాకోరుకు సమాధానం చెప్పింది ఆ ప్రియురాలు.. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..
ముంబై జోగేశ్వరి డివిజన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ ప్రాంతంలో ఫిబ్రవరి 6వ తేదీన ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మేఘావాడీలో 28 ఏళ్ల ప్రేమ (పేరు మార్చబడింది) తన కుటుంబంతో నివసిస్తోంది. తన ఇంటికి సమీపంలో నివసించే విజయ్ ఖంబే(30)తో ప్రేమలో పడింది మాలతి. వీరి ప్రేమ వ్యవహారం మాలతి ఇంట్లో తెలిసింది. వీళ్ల పెళ్లికి ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీనితో విజయ్ మద్యం సేవించి తరుచూ ఆమెతో గొడవకు దిగడమే కాకుండా.. మాలతి మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. విజయ్ వికృత చేష్టలకు విసిగిపోయిన మాలతి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ చర్య విజయ్లోని క్రూరత్వాన్ని మరింత బయటపడేలా చేసింది.
దీంతో శనివారం (ఫిబ్రవరి 6), మాలతి ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న విజయ్.. తన వెంట పెట్రోల్ బాటిల్ను తీసుకెళ్లాడు. మాలతితో వాగ్వాదానికి దిగాడు. అది కాస్తా పెద్ద గొడవగా మారింది. అయితే ముందే ప్లాన్ చేసుకుని వచ్చిన విజయ్.. అదును చూసుకుని మాలతి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అయితే మంటలు చెలరేగిన వెంటనే మాలతి.. విజయ్ను కూడా గట్టిగా హాగ్ చేసుకుని నిప్పంటించింది. వీరిద్దరి అరుపులు కేకలు విన్న చుట్టుప్రక్కల హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పి సమీపంలోని ట్రామా కేర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, హాస్పిటల్లో చికిత్స పొందుతూ విజయ్ చనిపోగా.. మాలతి ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.