మెయిన్‌పురిలో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా సమీపంలో  ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మెయిన్‌పురిలో ఘోర రోడ్డు ప్రమాదం

Edited By:

Updated on: Apr 21, 2019 | 5:00 PM

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా సమీపంలో  ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.